కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రయాణం కోసం ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాలు కోసం మొగ్గు చూపుతున్నారు. దీంతో బైక్ సేల్స్తో పాటు కుటుంబ సభ్యులు ఒకే వాహనంలో ప్రయాణించేలా కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. జూలై నెలలో సేల్స్ మెరుగైన విషయం తెలిసిందే.

పెరుగుతున్న మొదటిసారి కారు కొనుగోలుదారులు
కరోనా కారణంగా తొలిసారి కారును కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోందని శ్రీవాస్తవ తెలిపారు. వ్యక్తిగత ప్రయాణ సాధనాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులోనూ మొదటిసారి కారును కొనుగోలు చేసే వారి శాతం పెరిగిందని, ఇందుకు జూలై నెలలో విక్రయాలే నిదర్శనమన్నారు. ఎక్స్చేంజ్ లేదా రీప్లేస్మెంట్ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. మరోవైపు ఇప్పటికే కారు ఉన్నవారు అదనంగా మరో కారును కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారవాణాకంటే వ్యక్తిగత వాహనాలతో భద్రతను కోరుకుంటున్నారన్నారు. అందుకే పాసింజర్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. డొమెస్టిక్ పాసింజర్ వెహికిల్ సేల్స్ 2019 జూలైలో 96,478 కాగా, ఈసారి 1.3 శాతం పెరిగి 97,768గా ఉన్నాయి.

ఆదాయాలు తగ్గడంతో... ఆ పరిమితికి లోబడి కొనుగోలు
జూలైలో అమ్మకాలు మెరుగుపడటంతో పాటు రాబోయే పండుగ సీజన్లో విక్రయాలను బట్టి వాహన రంగ దీర్ఘకాల భవిష్యత్తు అంచనా వేసుకోవచ్చునని చెప్పారు. కరోనా దెబ్బతో ప్రజల ఆదాయస్థాయిల్లో కొంతమేర మార్పులు వచ్చాయని, దీంతో వారిపై ఒత్తిడిపడిందని, అందుకే ఆదాయ పరిమితులకు తగిన విధంగా వాహనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.

తొలిసారి కారుకొనుగోళ్ల పెరుగుదల శాతం
గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్తో పోలిస్తే ప్రస్తుత జూన్ త్రైమాసికంలో తొలిసారి కారును కొనుగోలు చేసిన వారి వాటా 5.5 శాతం పెరిగి 51-53 శాతానికి చేరుకుందని తెలిపారు. ఇదే సమయంలో ఎంక్వైరీలు కూడా కరోనా ముందున్న స్థాయిల్లో 85-90 శాతానికి చేరుకున్నాయన్నారు. ఈ ఎంక్వైరీల్లో 65 శాతం మినీ, కాంపాక్ట్ విభాగాల కార్ల కోసం చేసినవేనని తెలిపారు. గతంలో ఇది 55 శాతంగా ఉండేదని తెలిపారు. జూలైలో ఆల్టో, ఎస్-ప్రెస్పో వంటి చిన్న కార్ల విభాగం అమ్మకాలు 49.1 శాతం అధికమైన 17,258కి చేరాయని, 2019 జూలైలో ఈ సంఖ్య 11,577 మాత్రమేనని చెప్పారు. వ్యాగనార్, స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల సేల్స్ మాత్రం 10 శాతం తగ్గాయన్నారు. గత ఏడాది జూన్ క్వార్టర్లో 57,512 యూనిట్లు కాగా ఈసారి 51,529గా ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications