పర్మినెంట అకౌంట్ నెంబర్ (PAN) కార్డును, ఆధార్ కార్డును మార్చి 31 తేదీ లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. పాన్-ఆధార్ను మరో ఐదు రోజుల్లో లింక్ చేయకుంటే రూ.1000 వరకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, మీ పాన్ కార్డు కూడా చెల్లకుండా పోతుంది. ఈ మేరకు మంగళవారం ఫైనాన్స్ బిల్ 2021 సందర్భంగా ప్రభుత్వం దీనిని పేర్కొంది.
ప్రభుత్వం కొత్త సెక్షన్ (సెక్షన్ 234H)ను ఇన్కం ట్యాక్స్ యాక్ట్, 1961లో ఇన్సెర్ట్ చేసింది. మార్చి 31, 2021 నాటికి పాన్-ఆధార్ లింక్ చేయకుంటే పెనాల్టీ ఉంటుందని పేర్కొంది. గరిష్టంగా పెనాల్టీ రూ.1000 వరకు ఉంటుందని పేర్కొనడంతో పాటు పాన్ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి చెల్లదని పేర్కొంది.

పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. ఇప్పటికే చాలాసార్లు పొడిగించినందున మరోసారి పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఎవరైనా పాన్-ఆధార్ లింక్ చేయకుంటే ఈ 31వ తేదీ లోపు చేసుకోవాలి. ఏప్రిల్ 1వ తేదీ నుండి పాన్ కార్డు చెల్లకుంటే మరిన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ఆదాయపు పన్ను ఫైల్ చేయడం ఇబ్బందికరం. నాన్-కాంప్లియెన్స్కు అధిక ఫైన్ ఉంటుంది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా పేర్కొనవలసి ఉంటుంది. ఇన్-ఆపరేటివ్ పాన్ కార్డు కారణంగా అధిక టీడీఎస్ రేటును ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ యాక్ట్ ప్రకారం పాన్ నెంబర్ ఇవ్వని లేదా పని చేయని పాన్ వివరాలను ఇచ్చే వ్యక్తికి అధిక టీడీఎస్ లేదా టీసీఎస్ వర్తిస్తుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications