NEFT money transfer: నేడు మధ్యాహ్నం గం.2 వరకు నెఫ్ట్ సేవలు ఉండవ్
వివిధ బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్. నేడు (23 ఆదివారం) రోజున 14 గంటల పాటు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవలే ప్రకటన చేసింది. ఆదివారం(మే 23) ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది.
నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరచడం కోసం మే 22వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన అనంతరం ఈ సాఫ్టువేర్లో సాంకేతిక అపడేషన్ చేపడుతున్నామని, అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుండి అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి - మధ్యాహ్నం రెండు గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు నెఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.
ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం ఇచ్చాయి. ఏప్రిల్ 18వ తేదీన ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ ఆర్బీఐ ఇలాంటి టెక్నికల్ అప్గ్రేడేషన్ను చేపట్టింది. 2019 డిసెంబర్ నుండి నెప్ట్ సేవలు 24×7 అందుబాటులోకి వచ్చాయి.