NEFT money transfer: నేడు మధ్యాహ్నం గం.2 వరకు నెఫ్ట్ సేవలు ఉండవ్

వివిధ బ్యాంకుల కస్టమర్లకు అలర్ట్. నేడు (23 ఆదివారం) రోజున 14 గంటల పాటు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవలే ప్రకటన చేసింది. ఆదివారం(మే 23) ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది.

నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరచడం కోసం మే 22వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన అనంతరం ఈ సాఫ్టువేర్‌లో సాంకేతిక అపడేషన్ చేపడుతున్నామని, అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుండి అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి - మధ్యాహ్నం రెండు గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు నెఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.

NEFT money transfer facility to be unavailable till 2 pm today

ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారం ఇచ్చాయి. ఏప్రిల్ 18వ తేదీన ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ ఆర్బీఐ ఇలాంటి టెక్నికల్ అప్‌గ్రేడేషన్‌ను చేపట్టింది. 2019 డిసెంబర్ నుండి నెప్ట్ సేవలు 24×7 అందుబాటులోకి వచ్చాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+