మందగమనం: విద్యుత్ వినియోగం కూడా భారీగానే తగ్గింది
సాధారణంగా పెరిగే విద్యుత్ డిమాండ్ 2019 ఆగస్ట్ నుంచి పడిపోయింది. పారిశ్రామిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో క్షీణత తీవ్రంగా ఉంది. ఇటీవలి కాలంలో దేశంలో విద్యుత్ వినియోగ క్షీణత ఎక్కువగా పడిపోయింది. రుతుపవనాల ఆలస్యం, వ్యవసాయ రంగంలో డిమాండ్ తగ్గడం, డొమెస్టిక్, కమర్షియల్ రంగాల్లో కూలింగ్ రిక్వయిర్మెంట్ తగ్గడం వంటి కారణాలతో విద్యుత్ డిమాండ్ తగ్గింది.
అక్టోబర్ వంటి పండుగ సీజన్లో విద్యుత్ వినియోగం 12.5 శాతం తగ్గింది. గుజరాత్లో ఇది 18.8 శాతం ఉండగా, మహారాష్ట్రలో 21.1 శాతంగా ఉంది. భారత మొత్తం పారిశ్రామిక విద్యుత్ వినియోగ సగటు 40 శాతంగా ఉంటే, మహారాష్ట్రలో 46 శాతం, గుజరాత్లో 54 శాతం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది తగ్గింది.
భారత్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అక్టోబర్ నెలలో 3.8 శాతం తగ్గింది. వరుసగా మూడో నెల తగ్గింది. ఎలక్ట్రిసిటీ జనరేషన్ అక్టోబర్లో 12.2 శాతం తగ్గింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (IIP) సిరీస్లో ఓ నెలలో ఇంతలా తగ్గడం ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. విద్యుత్ వినియోగ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పడిపోతుంది. ఆగస్ట్లో మరింతగా తగ్గింది.
డిజిటల్ ఇండియా: మార్చి కల్లా అన్ని గ్రామాలకు ఉచిత వైఫై!