కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సేల్స్ ఏప్రిల్ నెలలో ఏకంగా జీరోకు పడిపోయాయి. డొమెస్టిక్ మార్కెట్లో తాము సింగిల్ యూనిట్ కూడా విక్రయించలేదని మారుతీ సుజుకీ ఇండియా (MSI) ఈ రోజు (మే 1) తెలిపింది. లాక్ డౌన్ ఆంక్షలతో మారుతీ కార్యాలయాలు క్లోజ్ అయ్యాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. మార్చి 24వ తేదీ నుండి కఠిన లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ ఒక్క కారు కూడా విక్రయించలేదు.
ఏప్రిల్ 2020లో దేశీయ మార్కెట్లో MSI అమ్మకాలు శూన్యమని మారుతి శుక్రవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఉత్పత్తి సౌకర్యాలు మూసివేయడంతో అమ్మకాలు లేవని పేర్కొంది.

ఏప్రిల్లో ఇతర ఒరిజినల్ పరికరాల తయారీ సంస్థ (ఓఇఎం) అమ్మకాలు కూడా లేవని వెల్లడించింది. అయితే 632 యూనిట్లను ఎగుమతి చేసినట్టు పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా మారుతి సుజుకి కంపెనీ జూన్ 30వ తేదీ వరకు కార్ల ఉచిత సర్వీస్, ఎక్స్టెండెడ్ వారంటీ తేదీల గడువును పొడిగించినట్లు గతంలో తెలిపింది. దేశంలో కరోనా కేసులు 35వేలు దాటాయి. మృతుల సంఖ్య 1,100 దాటింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications