కార్వీ బ్రోకింగ్ లాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబి చైర్మన్ అజయ్ త్యాగీ తెలిపారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (KSBL)లా క్లయింట్లను మోసం చేసి సొంత అవసరాలకు ఉపయోగించుకునే సంస్థలపై నిఘా పెంచేందుకు నూతన చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పారు.

అప్పుడే లైసెన్స్ రద్దు
కార్వీ తిరిగి చెల్లింపులపై వేచిచూసే దోరణి అవలంభిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14 నాటికి రూ.1,189 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో బ్యాంకులకు చెల్లించాల్సింది రూ.511 కోట్లు. మొత్తంగా సెక్యూరిటీలు రూ.183 కోట్లు తగ్గాయి. ఫండ్స్ రూ.495 కోట్లు తగ్గినట్లు గుర్తించామని తెలిపారు. గత ఏడాది నవంబర్ నెలలోనే కార్వీలో అవకతవకలను గుర్తించి లైసెన్స్లను రద్దు చేసినట్లు తెలిపారు.

అలా బకాయిలు చెల్లించాలి
కార్వీ ఇష్యూలో ఆ సంస్థతో పాటు NSEకి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బకాయిల చెల్లింపుకు సంబంధించి సంస్థకు ఊరట కల్పించే అంశాలు సూచించామన్నారు. ఇందులో కార్వీ అనుబంధ సంస్థల్లోని వాటాలను విక్రయించడం ద్వారా సమకూరే నిధుల్ని వచ్చే నెల చివరి వరకు బకాయిలు చెల్లించాలని లేదంటే చర్యలు తీసుకుంటామన్నారు. బకాయిలు తీర్చకుంటే తగిన చర్యలు ఉంటాయన్నారు.

మార్చికల్లా రూ.678 కోట్లు..
తన ఖాతాదారుల సెక్యూరిటీల మొత్తం విలువలై షార్ట్ఫాల్ రూ.678 కోట్లను మార్చికల్లా చెల్లిస్తామని NSEకి కార్వీ తెలిపిందని త్యాగి అన్నారు. కార్వీ గ్రూపులోని ఒక కంపెనీలో కొంత వాటాను విక్రయించి, ఈ నిదులను సమీకరిస్తుందన్నారు. ఇది ఎంత వరకు జరుగుతుందో చూడాలన్నారు. ఆ తర్వాతే చర్యలు అన్నారు.

సొమ్ము తిరిగి అందించడమే తొలి ప్రాధాన్యం
కార్వీ విషయంలో క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలు, సొమ్ము తిరిగి వారికి అందించడమే నియంత్రణ సంస్థ తొలి ప్రాధాన్యత అన్నారు. పెట్టుబడిదారుల శ్రేయస్సుకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. కాగా, కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్ల షేర్లను దుర్వినియోగపరిచిన ఆరోపణలు ఎదుర్కొంటోంది. 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను వారి అనుమతి లేకుండా తనఖా పెట్టి రూ.600 కోట్లు రుణం తీసుకుంది. దీంతో సెబి ఈ బ్రోకింగ్ సంస్థపై నిషేధం విధించింది. స్టాక్ ఎక్స్చేంజీలు కార్వీ లైసెన్స్ను రద్దు చేశాయి.

సీఎండీ పదవి విభజనకు గడువు పెంపు ఎందుకంటే
లిస్టైన కంపెనీల చైర్మన్, ఎండీ పదవుల విభజన గడువును సెబీ 2022 ఏప్రిల్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. నిబంధనలను అమలు చేయడంలో కంపెనీలకు సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో గడువు పొడిగించినట్లు త్యాగీ చెప్పారు. టాప్ 500 కంపెనీల్లో ఇప్పటివరకు 50% సీఎండీ పదవి విభజన జరిగినట్లు చెప్పారు. దాదాపు 250 కంపెనీలు ఇదివరకే చైర్మన్, సీఎండీలను విడగొట్టాయన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications