2021-22 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో రూ.67,400 కోట్ల మేర ఆదాయ పన్ను రీఫండ్ చెల్లింపులు జరిపినట్లు ఆదాయపు పన్ను మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలలో తెలిపింది. ఏప్రిల్ 1 నుండి ఆగస్ట్ 30వ తేదీ లోపు 23.99 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్కు రూ.67 వేల కోట్లు రిఫండ్ చేసినట్లు తెలిపింది. ఇందులో 22.61 లక్షల కేసులకు సంబంధించిన రూ.16,373 కోట్లు రిఫండ్, కార్పొరేట్ ట్యాక్స్కు సంబంధించి రూ.51 వేల కోట్లను (రూ.51,029 కోట్లు) రీఫండ్ చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాకెస్స్(CBDT) తెలిపింది.
ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్తో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈస్ధాయిలో రీఫండ్స్ జారీ కావడం ఊరట. ఈ-ఫైలింగ్ పోర్టల్లో సమస్యల కారణంగా పలువురు ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీ రిటన్సను సమర్పించలేదు. సాధారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన పదిరోజుల్లోగా రిఫండ్స్ జారీ చేస్తారు. ఇప్పటి వరకు మీకు రీఫండ్ కాకుంటే ఐటీ శాఖ వెబ్సైట్లో రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

రీఫండ్ స్టేటస్ చెకింగ్ ఎలా?
- ఇన్కం ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్లోకి వెళ్లాలి.
- యూజర్ ఐడీ, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆప్ ఇన్-కార్పోరేషన్ పేర్కొనాలి.
- My Account ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
- Refund/Demand Status ఆప్షన్ను ఎంచుకోవాలి.
- మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఐటీ రిటర్న్స్ స్టేటస్ కనిపిస్తుంది. మీ స్క్రీన్ పైన అసెస్మెంట్ ఇయర్, పేమెంట్ మెథడ్ వంటివి కనిపిస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications