న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో భారత ఎగుమతులు 5.12 శాతం క్షీణించి 24.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇది దాదాపు రూ.1.85 లక్షల కోట్లు. సెప్టెంబర్ మాసంలో సానుకూల వృద్ధి నమోదు చేసినప్పటికీ, గత నెల మాత్రం ఆ జోరు కొనసాగలేదు. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోళ్లు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు తగ్గినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో దిగుమతులు కూడా తగ్గాయి. దిగుమతులు 11.53 శాతం క్షీణించి 33.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఎగుమతులు, దిగుమతులు డౌన్, తగ్గిన వాణిజ్య లోటు
ఎగుమతులు 5 శాతం తగ్గినప్పటికీ, దిగుమతులు అంతకు రెట్టింపు కంటే ఎక్కువ 11.53 శాతం తగ్గడంతో వాణిజ్య లోటు 11.75 బిలియన్ డాలర్ల (రూ.87,713 కోట్లు) నుండి 8.71 బిలియన్ డాలర్లకు (రూ.65,016 కోట్లు) తగ్గింది. అక్టోబర్ ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు భారీగా క్షీణించాయి.
ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్లో వృద్ధిబాట (5.99 శాతం వృద్ధితో 7.58 బిలియన్ డాలర్లు) పట్టినప్పటికీ, అక్టోబర్లో 5.12 శాతం క్షీణత నమోదు కాడవం గమనార్హం.

ఈవి పడిపోయి, ఇవి పెరిగాయి
ఎగుమతులు భారీగా పడిపోయిన రంగాల్లో పెట్రోలియం ఉత్పత్తులు 52 శాతం, జీడిపప్పు 21.57 శాతం, రత్నాలు, ఆభరణాలు 21.27 శాతం, తోలు 16.67 శాతం,మ్యాన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ 12.8 శాతం, ఎలక్ట్రానిక్ గూడ్స్ 9.4 శాతం, కాఫీ 9.2 శాతం, సముద్ర ఉత్పత్తులు 8 శాతం, ఇంజనీరింగ్ వస్తువులు 3.75 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతులు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి.

ఏడు నెలల కాలంలో డౌన్
ఏప్రిల్-అక్టోబర్ ఏడు నెలల కాలంలో ఎగుమతులు 19.02 శాతం తగ్గి 150.14 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా నమోదయింది. చమురు దిగుమతులు 38.52 శాతం మేర తగ్గి 5.98 బిలియన్ డాలర్లు, చమురేతర దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బిలియన్ డాలర్లుగా ఉంది.

కరెంట్ అకౌంట్ పాజిటివ్
దిగుమతులు భారీగా తగ్గంతో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో వరుసగా రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ మిగులును నమోదు చేసింది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఆ త్రైమాసికం జీడీపీ వ్యాల్యూలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ మిగులు 0.6 మిలియన్ డాలర్లుగా నమోదయింది. నిర్ధిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చి, పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ను ప్రతిబంబిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేయనుంది. ఈ వ్యాల్యూ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications