న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. నేడు (శుక్రవారం, జనవరి 29) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దంలో ఇవి తొలి బడ్జెట్ సెషన్స్ కాగా, నేడు తొలి సెషన్. కరోనా వైరస్ కారణంగా నిర్మలమ్మ బడ్జెట్ పైన వివిధ రంగాలు కోటి ఆశలతో ఉన్నాయి. కరోనా కారణంగా 2020లో రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ను ఈ ప్రకటనలకు కొనసాగింపుగా చూడాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

ఆ రైల్లో తొలుత స్మార్ట్ విండో-స్విచ్
ప్రతి బడ్జెట్లో ప్రతి రాష్ట్రం, కోట్లాదిమంది బడ్జెట్లో రైల్వే కేటాయింపులపై కూడా ఆసక్తి కనబరచడం సహజం. ఈసారి రైల్వేల్లో భద్రతకోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ విండోను తీసుకు వస్తున్నారు. ఇది ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉండటంతో పాటు, ప్రైవసీ కూడా ఉంటుందని భావిస్తున్నారు. తొలుత న్యూఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో దీనిని ప్రవేశపెట్టనున్నారు. స్మార్ట్ స్విచ్ ఆన్ చేస్తే రైలు బోగీ కిటికీలు, లోపలు తలుపులు పారదర్శకంగా మారుతాయి. స్విచ్ ఆఫ్ చేస్తే యథావిధిగా మార్చుకోవచ్చు.

ప్రయోజనాలు
ప్రయాణీకులను అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. బయటి ప్రయాణీకులకు కనిపించరు. ఇది వారికి ప్రైవసీని కల్పిస్తుంది. బోగీల మధ్య ఉన్న గ్లాస్ డోర్లను కూడా ఇదే విధంగా మార్చనున్నారు. ఈ స్మార్ట్ విండోలను న్యూఢిల్లీ-హౌరా రాజధాని రైలులోని ఏసీ1 కోచ్లో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ విండో ప్రయాణీకులను అవాంఛి లైట్ నుండి కాపాడుతుంది. కఠిన యూవీ కిరణాల నుండి భద్రత ఇస్తుంది. ఈ కిటికీలు ప్రయాణీకులకు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా కలిగిస్తాయి.

రెడీ టూ ఈట్ మీల్
ఇదిలా ఉండగా, ఈ బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖ IRCTC ఆదాయం పెంచే చర్యలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ విభాగం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అడుగులు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా విమాన సేవల వలె రెడీ టూ ఈట్ మీల్స్ ప్రవేశ పెట్టే అవకాశముంది. దీనిని అమలు చేసేందుకు హల్దీరామ్, ఐటీసీ, ఎండీఆర్, వాగ్ బక్రీ, ఇతర ఆహార సంస్థలతో కలవనుందని తెలుస్తోంది. ఆ తర్వాత దీనిని IRCTCకి అప్పగించవచ్చు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications