న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. నేడు (శుక్రవారం, జనవరి 29) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ దశాబ్దంలో ఇవి తొలి బడ్జెట్ సెషన్స్ కాగా, నేడు తొలి సెషన్. కరోనా వైరస్ కారణంగా నిర్మలమ్మ బడ్జెట్ పైన వివిధ రంగాలు కోటి ఆశలతో ఉన్నాయి. కరోనా కారణంగా 2020లో రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్ను ఈ ప్రకటనలకు కొనసాగింపుగా చూడాలని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

ఆ రైల్లో తొలుత స్మార్ట్ విండో-స్విచ్
ప్రతి బడ్జెట్లో ప్రతి రాష్ట్రం, కోట్లాదిమంది బడ్జెట్లో రైల్వే కేటాయింపులపై కూడా ఆసక్తి కనబరచడం సహజం. ఈసారి రైల్వేల్లో భద్రతకోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ విండోను తీసుకు వస్తున్నారు. ఇది ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉండటంతో పాటు, ప్రైవసీ కూడా ఉంటుందని భావిస్తున్నారు. తొలుత న్యూఢిల్లీ-హౌరా రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో దీనిని ప్రవేశపెట్టనున్నారు. స్మార్ట్ స్విచ్ ఆన్ చేస్తే రైలు బోగీ కిటికీలు, లోపలు తలుపులు పారదర్శకంగా మారుతాయి. స్విచ్ ఆఫ్ చేస్తే యథావిధిగా మార్చుకోవచ్చు.

ప్రయోజనాలు
ప్రయాణీకులను అతినీలలోహిత కిరణాల నుండి కాపాడుతుంది. బయటి ప్రయాణీకులకు కనిపించరు. ఇది వారికి ప్రైవసీని కల్పిస్తుంది. బోగీల మధ్య ఉన్న గ్లాస్ డోర్లను కూడా ఇదే విధంగా మార్చనున్నారు. ఈ స్మార్ట్ విండోలను న్యూఢిల్లీ-హౌరా రాజధాని రైలులోని ఏసీ1 కోచ్లో ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ విండో ప్రయాణీకులను అవాంఛి లైట్ నుండి కాపాడుతుంది. కఠిన యూవీ కిరణాల నుండి భద్రత ఇస్తుంది. ఈ కిటికీలు ప్రయాణీకులకు మంచి ప్రయాణ అనుభవాన్ని కూడా కలిగిస్తాయి.

రెడీ టూ ఈట్ మీల్
ఇదిలా ఉండగా, ఈ బడ్జెట్లో రైల్వే మంత్రిత్వ శాఖ IRCTC ఆదాయం పెంచే చర్యలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ విభాగం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అడుగులు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా విమాన సేవల వలె రెడీ టూ ఈట్ మీల్స్ ప్రవేశ పెట్టే అవకాశముంది. దీనిని అమలు చేసేందుకు హల్దీరామ్, ఐటీసీ, ఎండీఆర్, వాగ్ బక్రీ, ఇతర ఆహార సంస్థలతో కలవనుందని తెలుస్తోంది. ఆ తర్వాత దీనిని IRCTCకి అప్పగించవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications