స్మార్ట్ఫోన్ మార్కెట్లో తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికాను దాటేసి మన దేశం రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రపంచంలో చైనా తరువాత భారత్ రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా అవతరించింది. ఈ విషయాన్ని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో అమెరికా మూడో స్థానానికి పడిపోయింది.
2019లో మన దేశంలో 158 మిలియన్ల స్మార్ట్ఫోన్ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాది అంటే.. 2018తో పోల్చి చూసుకుంటే ఇది 7 శాతం అధికం. ఫలితంగా స్మార్ట్ఫోన్ విపణిలో అమెరికాను తోసిరాజంటూ మన దేశం సెకండ్ ప్లేస్ను ఆక్రమించింది.

మరోవైపు మన స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్లు మరోసారి తమ సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా ఫోన్ బ్రాండ్లదే అత్యధిక వాటా. 2018లో చైనా బ్రాండ్ల వాటా 60 శాతం కాగా.. ఇది 2019లో మరింత పెరిగి 72 శాతానికి చేరింది.
చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ 28 శాతం మార్కెట్ షేర్తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. దీని తరువాత శామ్సంగ్ 21 శాతం, వివో 16 శాతం, రియల్ మీ 10 శాతం, ఒప్పో 9 శాతం వాటి దక్కించుకున్నాయి.
అయితే 2019 నాలుగో త్రైమాసికంలో మాత్రం చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో రాణించింది. ఈ రేసులో మొట్టమొదటిసారి దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ను దాటేసి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్లలో చైనా బ్రాండ్ వివో మార్కెట్ వాటా 21 శాతంగా ఉంది.
దీంతో షావోమీ తరువాత ఇన్నాళ్లూ రెండో స్థానంలో కొనసాగిన శామ్సంగ్.. తాజాగా 19 శాతం వాటాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు చైనా మరో బ్రాండ్ షావోమీ 27 శఆతం వాటాతో ఈ రేసులో తొలిస్థానంలో కొనసాగుతున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications