సాఫ్టువేర్ కంపెనీలు గత కొద్ది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఉద్యోగ వలసలను (ఆట్రిషన్) సమస్యను ఎదుర్కొంటున్నాయి. కరోనా అనంతరం అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్... ఐటీ ఉద్యోగుల వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఓటీటీ, ఏఐ వంటి డిజిటల్ టెక్నాలజీల్లో నైపుణ్యాలు ఉద్యోగులకు ఈ రంగంలో డిమాండ్ను పెంచింది. దీంతో ఈ నైపుణ్యాలు కలిగిన వారిని ఆకర్షించేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
ప్రత్యేక ఉత్పత్తులు, సేవలపై దృష్టి కేంద్రీకరించిన స్టార్టప్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీల్లో కోర్ నైపుణ్యం కలిగిన వారికి అధిక వేతనాలు అందిస్తున్నాయి. గత ఆరు నెలల్లో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ పెరిగింది. మహమ్మారి అనంతరం డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరిగి, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి డిమాండ్కు కారణంగా మారిందని చెబుతున్నారు.

వివిధ రంగాల్లోని కంపెనీలు క్లౌడ్ సేవలపై ఖర్చు చేస్తున్నాయి. దీంతో డేటా సెంటర్స్ కోసం ఐటీ కంపెనీలు భారీగా క్లౌడ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయని చెబుతున్నారు. ఒక్కో సాఫ్టువేర్ కంపెనీలో సగటున గత ఏడాది నాటికి 8 నుండి 10 శాతం ఉన్న డిజిటల్ నిపుణులు, ఇప్పుడు 25 శాతానికి పెరిగారు. సాధారణంగా ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి వెళ్లే వలసల రేటు ఇదివరకు 11 శాతం నుండి 12 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది 20 శాతం దాటింది. ఇదివరకు ఉద్యోగి కంపెనీ మారినప్పుడు 30 శాతం వరకు అధిక వేతనం ఉండిది. ఇప్పుడు 50 శాతానికి పెరిగింది.
More From GoodReturns

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?



Click it and Unblock the Notifications