చైనా నుండి ఇండియాకు దిగుమతులు 13% క్షీణత .. భారత్ ఎగుమతులు 16% పెరుగుదల : కస్టమ్స్ డేటా
ఇండియా చైనా ల మధ్య సరిహద్దు సైనిక ఘర్షణ మరియు కరోనావైరస్ మహమ్మారి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, చైనాకు భారతదేశం యొక్క ఎగుమతులు సంవత్సరంలో మొదటి 11 నెలల్లో 16% పెరిగాయని తాజా చైనా కస్టమ్స్ డేటా చూపించింది. దీనికి విరుద్ధంగా, ఇదే కాలంలో భారతదేశం మాత్రం చైనా నుండి తక్కువ దిగుమతి చేసుకుంది, ఇది 13 శాతానికి పడిపోయిందని కూడా డేటా చూపించింది.
విజయ్ మాల్యాకు మరో షాక్ ఇచ్చిన ఈడీ.. ఫ్రాన్స్ లో 1.6 కోట్ల యూరోల విలువైన ఆస్తుల అటాచ్
భారత్ లో బాగా తగ్గినా చైనా దిగుమతులు .. కానీ చైనాకు పెరిగిన ఎగుమతులు
తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంట సరిహద్దు ఘర్షణను బీజింగ్ రాజకీయం చేయనందున చైనాకు భారత ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయని , చైనా ఎలాంటి ఆంక్షలు వాణిజ్య పరంగా భారత్ కు పెట్టలేదని చైనా మీడియా చెప్పుకుంటుంది. మే నుండి ఎగుమతులు కొనసాగుతున్నా ఎగుమతులపై నియంత్రణ లేదని చైనా మీడియా చెబుతోంది. అయితే అదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతదేశానికి చైనా నుండి వచ్చే దిగుమతులు తగ్గడం కూడా భారతదేశంలో అంతర్గత డిమాండ్ పడిపోవడానికి కారణమని గ్లోబల్ టైమ్స్ సోమవారం తాజా ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాలపై ఒక నివేదికలో తెలిపింది.
చైనా నుండి భారత్ కు దిగుమతులు 13 % తగ్గుదల
సోమవారం విడుదల చేసిన కస్టమ్స్ డేటా ప్రకారం, యుఎస్ డాలర్ పరంగా జనవరి నుండి నవంబర్ వరకు చైనా భారతదేశానికి 59 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అయితే చైనా నుంచి భారత్ కు వచ్చే దిగుమతులు మాత్రం 13% తగ్గింది.అయితే, ఈ కాలంలో భారతదేశం నుండి చైనాకు దిగుమతులు 16% పెరిగాయి. పొరుగు దేశాలతో ఆర్థిక పరస్పర చర్యలను రాజకీయం చేయకుండా చైనా దూరంగా ఉంటుందని ఆ కారణంగానే భారతదేశం నుండి, చైనా ఎగుమతులు పెరుగుతూనే ఉన్నాయని చైనా నిపుణులు పేర్కొన్నారు.
చైనాకు ఇండియా నుండి ఎగుమతులు 16% పెరుగుదల
చైనా పట్ల భారత ప్రభుత్వం నుండి పెరుగుతున్న పక్షపాత వైఖరి కూడా దీనికి కారణం. ఇది చైనాలో తయారైన ఉత్పత్తులను భారతదేశంలోకి రావడాన్ని పరిమితం చేయడానికి, పెరుగుతున్న సుంకం అడ్డంకులతో సహా, చైనా ఉత్పత్తులు దిగుమతులను తగ్గించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇక చైనా మాత్రం రాజకీయ ఘర్షణలు ఉన్నప్పటికీ చైనా భారతదేశం నుండి ఎక్కువ దిగుమతి చేసుకుంటూనే ఉంది అని ఇది పేర్కొంది భారతదేశం నుండి చైనా దిగుమతులు మొదటి 11 నెలల్లో సుమారు 19 బిలియన్ డాలర్ల విలువైనవి, 16% పెరిగాయని పేర్కొంటున్నారు.
ఇండియా నుండి ప్రధానంగా ఎక్స్ పోర్ట్ అయ్యేవి ఇవే
బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం సంకలనం చేసిన సమాచారం ప్రకారం, 2019 లో చైనా సేంద్రీయ రసాయనాలు, ఎరువులు, యాంటీబయాటిక్స్ మరియు అల్యూమినియం రేకు కోసం భారతదేశం నుండి అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఉంది. చైనాకు భారతదేశం యొక్క ఎగుమతుల్లో సేంద్రీయ రసాయనాలు, ఇనుప ఖనిజాలు, అసంపూర్తిగా ఉన్న వజ్రాలు, చేపలు , పత్తి, గ్రానైట్ రాయి మొదలైనవి ఉన్నాయి అని భారత రాయబార కార్యాలయ డేటా చూపించింది.
2019 లోనే చైనాతో తగ్గిన భారతదేశ వాణిజ్య లోటు
2019 లోనే చైనాతో భారతదేశ వాణిజ్య లోటు ఒక దశాబ్దంలో మొదటిసారిగా తగ్గింది. 2019 లో, చైనాతో భారతదేశం యొక్క వాణిజ్య లోటు 2% కొద్దిగా తగ్గింది. 2019 సంవత్సరంలో భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 92.89 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా, తైవాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, వియత్నాం, మలేషియా, బ్రెజిల్ మరియు రష్యా తరువాత 2019 లో చైనా , భారతదేశం యొక్క 12 వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
ఇండియా నుండి చైనాకు దశాబ్దంలో మొదటిసారి బియ్యం ఎగుమతి
ఇదిలావుండగా, భారతీయ బియ్యాన్ని చైనా కొనుగోలు చేయడాన్ని కూడా చైనా మీడియా పేర్కొంది
గత వారం, చైనా దశాబ్దాలలో మొదటిసారిగా భారతీయ బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది, ఎందుకంటే రాయితీ ధరలకు బియ్యం లభిస్తుండటంతో చైనా కొనుగోలు చేస్తుంది. భారత వ్యాపారులు డిసెంబర్-ఫిబ్రవరి సరుకుల కోసం 100,000 టన్నుల బియ్యాన్ని టన్నుకు 300 డాలర్ల చొప్పున ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని న్యూఢిల్లీ నుండి వచ్చిన రాయిటర్స్ నివేదిక తెలిపింది.ఈ కొనుగోలు పూర్తిగా వాణిజ్యపరమైన చర్య అని చెప్తున్నారు.