న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి కాస్త మెరుగుపడిందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సవంత్సరంలో మూడో త్రైమాసికంలో ఇండియన్ ఎకానమీ 4.7శాతం వృద్ధిని నమోదుచేసిందని ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఆర్థిక నిపుణులు అంచనా ప్రకారమే దేశ స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) గత డిసెంబర్లో పెరిగిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రెండో త్రైమాసికంలో నమోదైన జీడీపీ కంటే మూడో త్రైమాసికంలో జీడీపీ 0.2 శాతం మేరా పెరిగి 4.5శాతంకు చేరిందని వెల్లడించింది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా పెరుగుదల నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత ఆర్థిక వృద్ధి 5శాతంగా ఉంది. గత 11 ఏళ్లలో ఇదే అత్యంత తక్కువగా నమోదైన వృద్ధి రేటు.పడిపోయిన వృద్ధి రేటు తిరిగి పుంజుకునేది మాత్రం 2021 ఆర్థిక సంవత్సరంలోనే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే చాలామంది ఆర్థికవేత్తలు మాత్రం ఈ సంఖ్యతో ఏకీభవించలేకున్నారు. వృద్ధి రేటు పెరగాలంటే అనేక అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని అందుకే ఈ సంఖ్యను టచ్ చేసే అవకాశం లేదని చెబుతున్నారు.

ఇక కరోనావైరస్ దెబ్బకు వాణిజ్య రంగం కుదేలైంది. ఇప్పటికే మార్కెట్లు విపరీతమైన నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్కు ఇది పెద్ద దెబ్బే అని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ దెబ్బ నుంచి మార్కెట్లు కోలుకునేందుకు మరికాస్త సమయం పడుతుందని జోస్యం చెబుతున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ బారిన పడి 2800 మంది మృతి చెందగా 83వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ఆ ప్రభావం భారత మార్కెట్లపై పడుతోంది. ముందుగా ఒక్క చైనాకే ఈ ప్రాణాంతక వైరస్ పరిమితమవుతుందని అంతా భావించినప్పటికీ అది మరో 57 దేశాలకు విస్తరించడం భారత మార్కెట్లను కలవరపాటుకు గురిచేస్తోంది.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి చెందడం అదే సమయంలో ప్రపంచ మార్కెట్లపై ఈ ప్రభావం పడుతుండటంతో ఎంత వరకు నష్టం వాటిల్లుతుందనేదానిపై ఆర్థికనిపుణులు అంచనా వేయలేకున్నారు. ఇదిలా ఉంటే భారత్కు మాత్రం ఈ సమయంలో ఒక ఊరటనిచ్చే అంశం బయటకొచ్చింది.
భారత ఆర్థిక వ్యవస్థకు మూలకారణంగా నిలిచే 8 రంగాలు జనవరి 2020లో 2.2శాతం మేరా వృద్ధిని నమోదు చేశాయి. మౌలిక సదుపాయాల రంగం జనవరి నెలలో 1.5శాతం వృద్ధిని రికార్డ్ చేసింది. అయితే మొత్తంగా చూస్తే దేశ ఆర్థిక వృద్ధి మాత్రం పలురంగాల్లో కరోనావైరస్ ఎఫెక్ట్ ఏమేరకు చూపుతుందనే దానిపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం డిమాండ్పై కూడా ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుందని చెప్పారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications