భారత ఆర్థిక వ్యవస్థ అన్ని రంగాల్లో పుంజుకుంటోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో చారిత్రక గరిష్టానికి చేరుకుంటోందన్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ క్షీణించిన విషయం తెలిసిందే. వ్యాపారంలో మనం తిరిగి పుంజుకుంటున్నామని గోయల్ అన్నారు. ఇందుకు జీఎస్టీ కలెక్షన్స్, ఎగుమతులు, FDI సంఖ్యలు నిదర్శనమని చెప్పారు. వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్టస్థాయిలను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.

విదేశీ పెట్టుబడులు 62 శాతం అధికం
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుందని, దేశ వస్తు సేవల ఎగుమతులు రికార్డు గరిష్ఠాలకు చేరే క్రమంలో ఉన్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లేదా రూ.30 లక్షల కోట్లుకు చేరుకునే అవకాశముందన్నారు. ఈ మేరకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్(ఐఐటీఎఫ్) ప్రారంభోత్సవం సందర్భంగా గోయల్ మాట్లాడారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో అత్యధికంగా 27 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ఏడాదిక్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇవి 62 శాతం అధికమన్నారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను కొనసాగించడంలో భారత్ను ప్రపంచ దేశాలు నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా చూస్తున్నాయని చెప్పారు. దేశంలో లాక్డౌన్ ఆంక్షలు విధించినప్పటికీ, అంతర్జాతీయ వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందించడంలో ఏమాత్రం వెనుకబడలేదన్నారు.

జీఎస్టీ వసూళ్ల రికార్డ్
సేవల ఎగుమతులకు సంబంధించి 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించగలమని గోయల్ అన్నారు. దీంతో వస్తువులు, ఉత్పత్తుల విషయంలో రికార్డ్ స్థాయి ఎగుమతులు నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశం వేగంగా కోలుకుంటోందనేందుకు అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.3 లక్షల కోట్లకు పైగా నమోదు కావడం నిదర్శనం అన్నారు. భారత్కు ఉన్న సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకొని, అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ ఇటీవలే భారత సార్వభౌమ రేటింగ్ను నెగిటివ్ నుండి స్టేబుల్కు మార్చిందని గుర్తు చేశారు. ఇన్ఫ్రా, వృద్ధిలో వైవిధ్యం, అభివృద్ధికి డిమాండ్ తదితర అంశాలు ఆర్థిక పునరుజ్జీవానికి దోహదపడతాయన్నారు.

ప్రపంచ ఫ్యాషన్ హబ్
ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ సహా వివిధ దేశాలతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలు వేగవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇవి అమలు చేస్తే దేశీయ ఉత్పత్తులకు మరింత డిమాండ్ పెరుగుతుందన్నారు. ఎందుకంటే మరిన్ని మార్కెట్లకు మన ఉత్పత్తులు విస్తరిస్తుందని చెప్పారు. ఫ్యాషన్ పరిశ్రమ కూడా వేగంగా వృద్ధి చెందుతోందని, ప్రపంచ ఫ్యాషన్ హబ్గా భారత్ అవతరిస్తుందన్నారు.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications