కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో పని విధానాన్ని మార్చింది. మానవ వనరులు తక్కువ వినియోగిస్తూ, సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చక్క బెట్టుకునేందుకు కంపెనీలు శరవేగంగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే వర్క్ ఫ్రం హోం చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, తాజా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వారి ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి . సాధ్యమైనంతవరకు యంత్రాల ద్వారా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పనులు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది.

ఉదోగ్య విషయంలో ఆందోళనపై సర్వే
కరోనా సంక్షోభం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు మానవ వనరుల కంటే, యంత్రాల ద్వారానే కార్యకలాపాలను నిర్వర్తించాలని వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక భారతదేశంలోని కంపెనీలలో డిజిటలైజేషన్, యాంత్రికీకరణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరాసరి కంటే అధికంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కాలంలో అసలు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అని ఆందోళన చెందుతున్న వేతన జీవులపై ఓ సర్వే నిర్వహించింది.

27 దేశాలలో 12 వేల మంది ఉద్యోగులను సర్వే చేసిన డబ్ల్యూఈఎఫ్
27 దేశాలలో 12 వేల మంది ఉద్యోగులను సర్వే చేసింది డబ్ల్యూ ఈ ఎఫ్. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా అంటే 54 శాతం ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారని సర్వే పేర్కొంది. భారతదేశంలో ఉన్న ఉద్యోగుల్లో 57 శాతం మంది ఇలా ఆందోళనలో ఉన్నారని సర్వే నివేదిక వెల్లడించింది. రష్యా దేశంలో 75 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాల విషయంలో ఆందోళన చెందుతున్నట్లుగా పేర్కొంది.

ఆన్లైన్ లో నిర్వహించిన జాబ్ రీసెట్ సమ్మిట్ లో డబ్ల్యూఈఎఫ్ నివేదిక
భవిష్యత్తు ఉద్యోగావకాశాలకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ లో తమ యాజమాన్యాలు సహకరిస్తాయని ప్రపంచ ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది నమ్మకంగా ఉన్నారని పేర్కొంది. ఇక భారతదేశంలోని ఉద్యోగుల్లో 80 శాతం కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలమంటూ ధీమాతో ఉన్నారు. ఈ మేరకు ఆన్లైన్ లో నిర్వహించిన జాబ్ రీసెట్ సమ్మిట్ లో డబ్ల్యూ ఈ ఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది.
ఉద్యోగాల విషయంలో నో గ్యారెంటీ అని చాలా మంది ఇప్పటి నుండే కొత్త నైపుణ్యాలను మెరుగు పరచుకునే పనిలో ఉన్నట్టు పేర్కొంది .
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications