గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-అసెస్మెంట్ స్కీం కింద 44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు పంపించింది. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్లో ఈ అసెస్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ మేరకు అప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అక్టోబర్లో దీనిని ప్రారంభించారు.
ఆదాయపు పన్ను గురించి మరిన్ని కథనాలు

44వేల మందికి నోటీసులు
గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ స్కీంను తీసుకు వచ్చారు. పన్ను రిటర్న్స్ పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు, అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. టెక్నాలజీని ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్ను సరికొత్త శిఖరాలకు చేర్చినట్లు ఐటీ శాఖ తెలిపింది.

ఏమిటీ ఈ-అసెస్మెంట్
పన్ను చెల్లింపుదారులకు జారీ చేసిన నోటీసుకు ప్రత్యుత్తరం ఇచ్చే ఈ-అసెస్మెంట్ స్కీం కింద ఎవరైనా వ్యక్తి లేదా పన్నుచెల్లింపుదారు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఇన్కం ట్యాక్స్ అథారిటీ ముందు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదు.

ఈ-అసెస్మెంట్ ప్రయోజనాలు
- సెంట్రలైజ్డ్ ఈ-అసెస్మెంట్ సెంటర్ నుంచి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసులకు డిజిటల్ విధానాలలోనే సమాధానాలు ఇవ్వాలి.
- పన్ను చెల్లింపుదారులను టెక్స్ట్ సందేశాల రూపంలో అప్రమత్తం చేస్తారు.
- పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను ఈ మెయిల్ రూపంలో పంపించవచ్చు.
- వ్యక్తులు, అధికారుల జోక్యం తగ్గిపోతుంది. ఆఫీస్ల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది.

ఆటోమేటిక్ విధానం
- కేసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 8 ఈ-అసెస్మెంట్ కేంద్రాలకు పంపిస్తారు. ఆటోమేటిక్ విధానంలో జరుగుతుంది. తద్వారా పారదర్శకత ఉంటుంది.
- ఈ పథకం కింద జాతీయ ఈ-అసెస్మెంట్ సెంటర్ ఆదాయపు పన్ను శాఖ కింద ప్రాంతీయ ఈ-అసెస్మెంట్ సెంటర్లు ఉంటాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications