గుడ్న్యూస్! వస్త్ర పరిశ్రమపై జనవరి 1, 2022 నుండి జీఎస్టీని పెంచాలనే ప్రతిపాదనలపై జీఎస్టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని తీర్మానం చేసింది. వచ్చే జీఎస్టీ మండలి భేటీలో ఈ విషయమై అనుసరించాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు వెల్లడించింది. చేనేత, జౌళీ పరిశ్రమపై జీఎస్టీని ఐదు శాతం నుండి పన్నెండు శాతానికి పెంచాలని గతంలో నిర్ణయించారు. ఇది జనవరి 1 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి వాయిదా పడింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ అయింది.
జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దుస్తులపై జీఎస్టీని ఐదు శాతం నుండి పన్నెండు శాతం పెంచాలనే నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. దీంతో వాయిదా వేసింది. డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సహా అనుబంధ రంగాల వర్తకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్మలమ్మ పలు రాష్ట్రాలతో, రంగాలతో జరిపిన సమావేశంలోను ఈ అంశం చర్చకు వచ్చింది. మెజార్టీ రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. నిర్మలమ్మకు కేటీఆర్ లేఖ కూడా రాశారు.

చేనేత, జౌళీ పరిశ్రమపై జీఎస్టీని పెంచితే విక్రయాలపై ప్రమాదం చూపుతాయని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పత్తి, నూలు ధరలు గత ఏడాది దాదాపు నలభై శాతం పెరిగాయని, రసాయనాలు, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని గుర్తు చేస్తున్నారు. ఈ రంగంలో ఎనభై శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే ఉన్నాయన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications