గుడ్న్యూస్, తగ్గనున్న టూ-వీలర్ల ధరలు! నిర్మలా సీతారామన్ హింట్
ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్న్యూస్. స్కూటీ, బైక్స్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేటు తగ్గింపుపై హింట్ ఇచ్చారు. మంగళవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(CII)తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టూవీలర్లపై జీఎస్టీ భారం తగ్గింపుపై స్పందించారు. అదే జరిగితే వీటి ధరలు కూడా కొంతమేరకు తగ్గనున్నాయి.
వ్యవస్థలోకి రూ.20,000 కోట్లు, ధరలు మరింతగా పెరగొచ్చు: వడ్డీరేట్లపై RBI వ్యాఖ్య
బైక్ లగ్జరీ వస్తువు కాదు.. హానికరమైనదీ కాదు
ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన వస్తువులు కాదని, అలా అని హానికర వస్తువులు కూడా కాదని, కాబట్టి జీఎస్టీ రేట్ల సవరింపుకు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రేట్ల సవరణ ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. లగ్జరీ ఉత్పత్తులు, హానికరమైన వస్తువు కానీ టూవీలర్లపై ఎక్కువ జీఎస్టీ రేటు సరికాదని అభిప్రాయపడ్డారు.
28 శాతం నుండి 18 శాతానికి..
ప్రస్తుతం టూ-వీలర్ల పైన అత్యధికంగా 28 శాతం పన్ను ఉంది. జీఎస్టీ రేట్లలో 28 శాతం అధికం. హయ్యెస్ట్ రేటు ఉంది. టూవీలర్లపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ఈ వీడియో కాన్ఫరెన్స్లో పరిశ్రమ వర్గాలు కోరాయి. దీనిపై ఆర్థికమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పై-వ్యాఖ్యలు చేశారు. 150 సీసీ బైక్స్ పైన ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని, ఆ తర్వాత దశలవారీగా ఆయా విభాగాలపై జీఎస్టీలో కోత విధించాలని గత ఏడాది హీరో మోటో కార్ప్ ప్రభుత్వాన్ని కోరింది.
ఎంఎస్ఎంఈలకు మరింత సహకారం
గురువారం జీఎస్టీ కౌన్సిల్ 41వ భేటీ జరుగనుంది. వచ్చే నెల 19వ తేదీన 42వ సమావేశం జరగుతుంది. మరోవైపు రూ.3 లక్షల కోట్ల రుణ హామీ పథకంలో మార్పులు చేసి చిన్నవ్యాపారులకు మరింత ఆర్థిక సహకారాన్ని అందిస్తామని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపినట్లు సీఐఐ వెల్లడించింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఎంఎస్ఎంఈలకు ఈ పథకాన్ని తెచ్చిన విషయం తెలిసిందే.