రిలయన్స్‌లో 7.7 శాతం వాటా గూగుల్ సొంతం, 33 వేల కోట్లు చెల్లింపు..

రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెడతామని ఇదివరకే గూగుల్ స్పష్టంచేసింది. ఈ మేరకు రూ.33 వేల 737 కోట్లను చెల్లించింది. దీంతో జియో ప్లాట్‌ఫామ్‌లో 7.73 శాతం వాటాను గూగుల్ సొంతం చేసుకుంది. గూగుల్ కాక ఇతర కంపెనీలు కూడా ఆర్ఐఎల్ పెట్టుబడులు పెట్టాయి.

11 వారాల్లో 13 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. దీంతో 33 శాతం వాటాను జియో విక్రయించింది. ఆ మేరకు వాటా విక్రయించడంతో 1.52 లక్షల కోట్లను కంపెనీ సమీకరించింది. అయితే గూగుల్ పెట్టుబడితో రిలయన్స్ కంపెనీకి ఆర్థికంగా మేలు జరిగిందని నిపుణులు చెబుతున్నారు. గూగుల్, జియో ప్లాట్ ఫాం కలిసి తక్కువ ధరలో కొత్త ఫోన్ రూపొందించనుంది. దీనికి సంబంధించి గత జూలైలో రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Google pays rs.33737 crore to Jio Platform

ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంతో ఇక మొబైల్ రూపొందించడంలో బిజీగా ఉండనున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా మొబైల్ ఉంటుంది. తక్కువ ధరలో అన్నీ ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో మొబైల్ సేల్స్ కూడా ఎక్కువ జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+