న్యూఢిల్లీ: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, బంగారం, టీ, బాస్మతి సహా ఎన్నో దిగుమతులు, ఎగుమతులపై ప్రభావం పడుతోంది. బంగారం, క్రూడాయిల్ ధర అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనిన నేపథ్యంలో ఓ వైపు కొన్నింటి ధరలు పెరుగుతుంటే, మరికొన్ని మన ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వరుసగా ఐదు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సోమవారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ 18 పైసలు పెరిగింది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ.80.48, డీజిల్ రూ.74.88 వద్ద, అమరావతిలో పెట్రోల్ 15 పైసలు పెరిగి రూ.80.01, డీజిల్ 18 పైసలు పెరిగి రూ.74.07 వద్ద, విజయవాడలో పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి రూ.79.65, డీజిల్ 18 పైసలు పెరిగి రూ.73.73 వద్ద ఉంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పశ్చిమాసియా భయాలు క్రూడాయిల్ మార్కెట్కు ఎక్కువగా ఉన్నాయి.

80 డాలర్లకు బ్రెంట్ క్రూడాయిల్
అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు బ్యారెల్ 80 డాలర్లకు చేరుకోవచ్చునని కమోడిటీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్రెంట్ క్రూడాయిల్ ఇటీవల ఏకంగా 4 శాతం పెరిగి 70 డాలర్లకు చేరువైంది. ఇది 80 డాలర్లకు చేరుకుంటుందని అంటున్నారు.

పెరుగుతున్న బంగారం ధర
ఇరాన్ కమాండర్ ఖాసీమ్ను హతమార్చడం, భౌగోళిక ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు అనిశ్చితిలో ఉన్నారు. దీంతో సురక్షిత సాధనాల వైపు చూస్తున్నారు. దీంతో క్రూడాయిల్తో పాటు బంగారం ధర భారీగా పెరిగింది. ఈ దాడి తర్వాత బంగారం ధర దాదాపు రూ.1500కు పైగా పెరిగింది. నిన్నటి వరకు చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం భయంతో బంగారంపై పెట్టుబడి పెడితే ఇప్పుడు ఇరాన్ - అమెరికా భయంతో పసిడి వైపు చూస్తున్నారు. బంగారం గత వారం దాడుల అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 25 డాలర్లు ఎగిసింది.

మన ఎగుమతులపై ప్రభావం
రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మన ఎగుమతులపై కూడా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా టీ, బాస్మతి పరిశ్రమలు ఆందోళనలో ఉన్నాయి. సీఐఎస్ దేశాల తర్వాత ఇరాన్.. భారత్ నుంచి టీ పొడిని దిగుమతి చేసుకుంటుంది. గత ఏడాది నవంబర్ సీఐఎస్ దేశాలకు 5.28 కోట్ల కిలోల టీ పొడిని ఎగుమతి చేయగా, ఇరాన్కు 5.04 కిలోలు ఎగుమతి చేసింది భారత్. ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశముంది.

బాస్మతి ఎగుమతులు నిలిపివేత
ఇరాన్లో పరిస్థితులు చక్కబడే వరకు బాస్మతి బియ్యం ఎగుమతులను నిలిపేయాలని ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఎగుమతిదారులకి సూచించింది. అక్కడకు పంపించే బియ్యం ఎగుమతులకు ఏమైనా జరిగితే దేశీయంగా రైతులపై, బియ్యం ధరలపై ప్రభావం పడుతుందని తెలిపింది. గత క్వార్టర్లో భారత్ రూ.32,800 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇందులో రూ.10,800 కోట్ల బాస్మతి ఇరాన్కు ఎగుమతి చేసింది భారత్. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రూ.17,700 కోట్ల విలువైన రూ.23.64 లక్షల టన్నుల బాస్మతి ఎగుమతి చేయగా ఇందులో రూ.4,500 కోట్ల ఎగుమతులు ఇరాన్కు వెళ్లాయి.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..



Click it and Unblock the Notifications