FY21లో జీడీపీ 9.5% ప్రతికూలత, నాలుగో క్వార్టర్కు పాజిటివ్: RBI గవర్నర్
ముంబై: 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.5 శాతం మేర క్షీణించవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఆర్బీఐ MPC భేటీ అయింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను దాస్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో వృద్ధి రేటు 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. నాలుగో క్వార్టర్ నాటికి జీడీపీ పాజిటివ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా నేపథ్యంలో నిన్నటి వరకు ఉన్న మానసిక భయం, నిరాశ నుండి ఆశ వైపు వెళ్తోందని శక్తికాంతదాస్ అన్నారు. నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్భణం లక్ష్యానికి చేరువగా ఉంటుందన్నారు. జీడీపీ వృద్ధి రేటు నాలుగో క్వార్టర్ నాటికి సానుకూలంగా ఉండవచ్చునన్నారు. వివిధ రంగాలు ఆర్థికంగా వేగంగా కోలుకుంటున్నాయన్నారు.
వడ్డీరేటు 4%, వడ్డీ రేట్లు యథాతథం: RBI గవర్నర్ శక్తికాంతదాస్
వ్యవసాయం, వినియోగ వస్తువులు, పవర్, ఫార్మా రంగాలు చాలా వేగంగా రికవరీ అవుతున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.5 శాతం ప్రతికూలత నమోదు చేయవచ్చునని అంచనా వేశారు. సెప్టెంబర్ నెలలో పీఎంఐ 56.9 శాతానికి పెరిగిందన్నారు. జనవరి 2012 నుండి ఇది గరిష్టం.