Farmer: రైతుల పరిస్థితి దిగజారుతోందనే వార్తలు రోజూ మీడియాలో సర్వసాధారణంగా వింటూనే ఉన్నాం. కానీ అవి ఎంత దారుణంగా ఉన్నాయో.. వాస్తవ పరిస్థితులను చూస్తేనే గానీ మనకు అర్థంకాదు. అచ్చం అలాంటి సంఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. అసలు ఏం జరిగిందంటే..

పంట లాభమా..? నష్టమా..?
పంట పూర్తిగా చేతికొచ్చినా.. దానికి కనీసం సరైన గిట్టుబాటు ధర లభిస్తేనే ఉపయోగం. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున కూరగాయల నుంచి అన్ని ఆహార పదార్థాల ధరలు ప్రజలకు అందుబాటులో లేనంత స్థాయికి చేరుకున్నాయి. రైతులకు ఈ సమయంలో పండించిన కూరగాయలను అమ్ముకోవటం కూడా కష్టతరంగా మారిపోయింది. వంకాయలు పండించిన ఒక రైతు దానిని అమ్ముకోవటానికి వెళితే ఎదురైన చేదు అనుభవం గురించి తెరపైకి వచ్చిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత ఘోరం..
ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లా, మహాసముంద్కు చెందిన ఒక రైతుకు చేదు అనుభం ఎదురైంది. అతను పండించిన 1485 కిలోల వంకాయను రాయ్పూర్లోని హోల్సేల్ కూరగాయల మార్కెట్కు పంపాడు. ఈ క్రమంలో మొత్తం వంకాయలను రూ.2,475కు విక్రయించారు. రూ.2,200 సరుకు, రూ.198 హమాలీ, రూ.198 కమీషన్ కలిపుకుని అతడికి రూ.2,596 బిల్లును కూరగాయల వ్యాపారి రైతుకు అందజేశారు.
ఇక్కడ సదరు రైతు ఆదాయం కంటే వచ్చిన బిల్లు ఎక్కువ. దీంతో కూరగాయలు అమ్ముకున్న అతడు లాభం పొందాల్సింది పోగా తన జేబు నుంచే రూ.121 ఎదురు చెల్లించుకోవాల్సి వచ్చింది. మార్కెట్లో డిమాండ్కు మించి కూరగాయలు వస్తుండటంతో ధరలు దొరకడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అలా అతనికి మైనస్ బిల్లింగ్ వచ్చింది.

రైతుల అతలాకుతలం..
పండించిన పంటకు వస్తున్న ధర కంటే దానికోసం అవుతున్న ఖర్చులు ఎక్కువగా ఉండటం రైతులను అతలాకుతలం చేస్తోంది. దుర్గ్, రాయనంద్గావ్, రాయ్పూర్ నుంచి బస్తర్ వరకు కూరగాయల సాగుదారులు తమ ఉత్పత్తులకు అయ్యే ఖర్చును భరించలేక ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ కంటే తక్కువ కూరగాయలు ఉన్నా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు.
దీంతో కూరగాయల ధరలను మార్కెట్లో ప్రదర్శించాలని రైతులు అంటున్నారు. గిరాకీ ఉన్నా గత నెలన్నర రోజులుగా కూరగాయల డిమాండ్ పెరుగుతున్నా.. వాటి ధరలు మాత్రం తగ్గుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులపై ప్రభుత్వాలు స్పందించాలని వారు కోరుతున్నారు. రైతులకు సహాయక చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టమోటా సంక్షోభం..
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా టమోటా పంట వేగంగా రైతుల చేతికి వస్తోంది. ఈ కారణంగా మార్కెట్లోకి గత కొన్ని రోజులుగా వాటి రాక పెరిగింది. మండీల్లో కొనుగోలుదారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు పండించిన టమాటాలను తీసి క్యారెట్లలో ఉంచి ప్రాసెసింగ్ ప్లాంట్లకు ఇస్తున్నారు. అయితే ప్లాంట్లకు వాహనాల్లో టమాటాలను తీసుకెళితే అవి అక్కడ దాదాపు 3 రోజులు నిలిచిపోతున్నాయని అద్దె భారంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలీఫ్లవర్, క్యాబేరీ వంటి పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉందని వారు అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications