దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది . నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ యొక్క నో-ఫ్రిల్ అనుబంధ సంస్థ-అక్టోబర్ 2 వరకు దుబాయ్ కు సర్వీసులను నడపరాదని పేర్కొంది . ఇండియన్ ఎయిర్ లైన్స్ దుబాయ్ కి కరోనా సోకిన ప్రయాణీకులను తీసుకెళ్లినట్లు తేలింది.

15 రోజులపాటు ఎయిర్ ఇండియా విమానాలకు బ్రేక్ వేసిన దుబాయ్ ఎమిరేట్స్
దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ దుబాయ్ లో ఎయిర్ లైన్స్ ఆపరేషన్ ను సెప్టెంబర్ 18 నుండి 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్ -19 సోకిన ప్రయాణీకుడిని రెండవ సారి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ఒకసారి కోవిడ్ పాజిటివ్ ఉన్న ప్రయాణికుడిని తీసుకు వెళ్ళిన ఇండియన్ ఎయిర్ లైన్స్ రెండవ సారి కోవిడ్ -19 పాజిటివ్ ప్రయాణీకుడిని తీసుకువెళ్లటం , కరోనా నిబంధనలను పాటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ఈ నిర్ణయం తీసుకుంది .కరోనా పాజిటివ్ ఉన్న ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ తో జైపూర్ నుండి దుబాయ్ కు సెప్టెంబర్ 4వ తేదీన 7 ఇండియా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కరోనా పాజిటివ్ వ్యక్తిని తీసుకువెళ్ళిన ఎయిర్ ఇండియా విమానం .. నిబంధనల ఉల్లంఘన
దుబాయ్ ఎమిరేట్లోని విమానాశ్రయాలకు సంబంధించిన నిర్దేశించిన విధానాలను , ప్రోటోకాల్లను ఉల్లంఘిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని దుబాయ్ యొక్క ఏవియేషన్ రెగ్యులేటర్ తెలిపింది. దుబాయ్ విమానాశ్రయాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యొక్క అన్ని ఆపరేషన్లు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని ,15 రోజుల వరకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిబంధనల ప్రకారం భారతదేశం నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తన ప్రయాణానికి 96 గంటల ముందు చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలి. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కూడా తీసుకువెళ్లటమే ఈ నిర్ణయానికి కారణం .

ఎయిర్ ఇండియాపై ఖర్చుల భారం , వివరణ కోరిన దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధారిటీ
ఎయిర్ ఇండియా సర్వీసులను నిలిపివేయడంతో పాటు, వైద్య సేవలకు , ఇతర ప్రయాణీకుల క్వారంటైన్ తో పాటు సంబంధిత ఇతర ఖర్చులకు డబ్బు చెల్లించమని పేర్కొంది. కొచ్చి ప్రధాన కార్యాలయ విమానయాన సంస్థ దుబాయ్కి తన విమానాలను తిరిగి ప్రారంభించాలంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించడానికి వివరణ కూడా ఇవ్వాలని కోరారు. సస్పెన్షన్ వ్యవధిలో ఎయిర్ లైన్స్ తన దుబాయ్ వెళ్ళే విమానాల సర్వీసులను షార్జాకు మళ్ళిస్తుందని సీనియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారి తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications