127 లక్షల నుండి 77 లక్షలకు తగ్గిన విమాన ప్రయాణీకులు
కరోనా వైరస్ ప్రభావం విమాన ప్రయాణాలపై కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో నలభై శాతం వరకు క్షీణించి 77.34 లక్షలకు పరిమితమైనట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(DGCA) తెలిపింది. 2020 జనవరిలో 1.27 కోట్ల మంది ప్రయాణికులు డొమెస్టిక్ రూట్లలో ప్రయాణించారు. ఇండిగో, స్పైస్ జెట్, ఎయిరిండియా, గో-ఎయిర్, విస్తారా, ఎయిరేషియాలలో ప్రయాణికుల భర్తీ సామర్థ్యం 70 శాతం నుండి 64.9 శాతం మధ్య నమోదయింది.
ఇండిగో 54.30 శాతం మార్కెట్ వాటాతో 42.03 లక్షల ప్రయాణికులను, విస్తారా ఎయిర్ లైన్స్ 12.8 శాతం వాటాతో 9.92 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి బయలుదేరే లేదా చేరుకునే ఇండిగో విమానాలు 93.7 శాతం కచ్చిత సమయంలో నడిచినట్లు డీజీసీఏ తెలిపింది.
డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ 2021 జనవరిలో 77.34 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చాయి. అంతకుముందు ఏడాది ఇది 127.83 లక్షలుగాఉంది. 39.60 శాతం క్షీణించింది.