కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి వివిధ ప్రయివేటు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ ప్లాంట్లలో వెంటిలెటర్లు తయారు చేస్తామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలెటర్ను తక్కువ ధరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనిపై మహీంద్రా గ్రూప్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వెంటిలెటర్ ఖరీదు రూ.7500
రూ.10,000వరకు విలువ చేసే ఆధునాతన వెంటిలెటర్ను కేవలం రూ.7,500కే తయారు చేయగలమని ఆ కంపెనీ తెలియజేసింది. ఐసీయు వెంటిలెటర్లను సొంతగా తయారు చేయడంపై దృష్టి సారించామని, ఈ ఆధునాతన మెషీన్ల విలువ రూ.5 నుండి రూ.10 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. అయితే తాము తయారు చేసే ఆటోమేటెడ్ బ్యాంగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ విలువ రూ.7,500 లోపు ఉండవచ్చునని పేర్కొంది.

అనుమతి వస్తే తయారీ
ఈ మేరకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ఆటోమేటెడ్ బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలెటర్ ఖరీదు రూ.7500లోపు ఉండవచ్చునని తమ బృందం అంచనా వేస్తోందనితెలిపారు. అనుమతుల కోసం మూడు రోజుల్లోగా ఓ నమూనాను సిద్ధం చేస్తామన్నారు. ఓసారి అనుమతి వస్తే తయారీకి సిద్ధమవుతామన్నారు.

ఆనంద్ మహీంద్రా థ్యాంక్స్
ఈ వెంటిలెటర్ తయారు చేసిన తమ బృంద సభ్యులకు ఆనంద్ మహీంద్రా థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం వెంటిలెటర్లను తయారు చేస్తున్న రెండు ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు కంపెనీ ఎండీ పవన్ గోయెంకా తెలిపారు. డిజైన్ను పరిశీలించి, సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications