కరోనా వైరస్ దెబ్బతో దేశంలో చాలా దుకాణాలు మూతబడ్డాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ కూడా తగ్గిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. దీంతో గత రెండు మూడేళ్లలో ఈ పేమెంట్స్ భారీగా పెరిగాయి. జ్యూస్ తాగినా, టీ తాగినా, ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ చేయడం సర్వసాధారణమైంది. కానీ కరోనా దెబ్బకు ఎన్నో దుకాణాలు మూతబడటం, ప్రజలు బయటకు రావడం తగ్గిపోవడంతో ఈ పేమెంట్స్ తగ్గిపోయాయి.

30 శాతం మేర పడిపోతాయని అంచనా
ఎన్నో దుకాణాల మూత, ఎయిర్లైన్ టిక్కెట్ క్యాన్సిలేషన్, ప్రజలు ఖర్చులు తగ్గించుకోవడం, థియేటర్ల మూత, పార్కులు క్లోజ్.. ఇలా వివిధ కారణాలతో డిజిటల్ పేమెంట్స్ 30 శాతం మేర పడిపోతాయని అంచనా. ప్రధానంగా మెట్రో వంటి మెట్రో నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేమెంట్ కంపెనీలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి కస్టమర్ ట్రాఫిక్ ఉన్నప్పటికీ..
ప్రస్తుతానికి డిజిటల్ పేమెంట్ ఛానల్స్ కస్టమర్ ట్రాఫిక్ ఎక్కువే ఉంది. కానీ ఇది క్రమంగా తగ్గుతోందట. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్ కస్టమర్ల దినచర్యను ప్రభావితం చేయలేదని చెప్పలేమని అంటున్నారు. ఆఫ్ లైన్ ట్రాన్సాక్షన్స్ను ఇప్పుడే అంచనా వేయలేమని, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు.

వేటిపై ఎంత తగ్గవచ్చునంటే..
కరోనా కారణంగా ఈ-కామర్స్ పేమెంట్స్ 40 శాతం వరకు ఎయిర్లైన్స్ టిక్కెట్ ప్రభావం 30 శాతం, రోడ్ అండ్ ట్రావెల్, టెలికం బిల్స్ ప్రభావం 16 శాతం, ప్రభుత్వ సేవల ప్రభావం 14 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ సంబంధిత కంపెనీలు రేజోర్పే, సీసీఅవెన్యూ దీనిపై స్పందిస్తూ... అన్ని ఆన్లైన్ ఖర్చులు 25 శాతం వరకు తగ్గవచ్చునని పేర్కొన్నాయి.

భారత్ పే ఏం చెప్పిందంటే
ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ 10 శాతం నుండి 15 శాతం మేర తగ్గాయని భారత్ పే తెలిపింది. మార్కెట్లు మూతబడుతున్నాయని, చాలా దుకాణాలు తెరుచుకోవడం లేదని, ముంబై వంటి నగరాల్లో బిజినెస్ తగ్గిందని, దీంతో గత వారం పది రోజులుగా 10 శాతం ట్రాన్సాక్షన్స్ తగ్గినట్లు తెలిపింది.

ఇక్కడ మాత్రం ఆన్లైన్ బిజినెస్ పెరిగింది
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ తగ్గినప్పటికీ యుటిలిటీ, కిరాణా, ఆహార విభాగాలలో మాత్రం డిజిటల్ పేమెంట్స్ పెరిగాయట. దుకాణాలు మూతబడుతుండటంతో చాలామంది ఆన్ లైన్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో తప్పనిసరి పదార్థాలలో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయిని రేజోర్పే సీఈవో హర్షిల్ మాథుర్ అన్నారు.

ట్రాన్సాక్షన్స్ పెరిగాయని పేటీఎం
పేటీఎం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇదివరకటి కంటే రోజువారీ డిజిటల్ పేమెంట్స్ తమకు పెరిగాయని చెప్పడం గమనార్హం. ఫ్యూయల్, యుటిలిటీ, ఫుడ్ వంటి వాటిలో పెరుగుదల ఉందని తెలిపారు. క్యాష్ కంటే పేటీఎం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని దీంతో పేమెంట్స్ పెరిగాయన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications