2020-21 ద్రవ్యలోటు 5 శాతానికి పైగా ఉండొచ్చు
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికలోటు స్థూలజాతీయోత్పత్తి కంటే 1.7 శాతం నుండి 1.8 శాతం ఎక్కువ ఉండవచ్చునని చీఫ్ ఎనకమిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అన్నారు. ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో జీడీపీ తగ్గవచ్చునని తెలిపారు. 10 శాతం నామమాత్రపు జీడీపీ వద్ద స్థిరంగా ఉంటే అలాంటి పెరుగుదల సంవత్సరానికి జీడీపీలో 5.2 శాతం నుండి 5.3 శాతం ఉంటుందన్నారు.
సూపర్: ఆ విషయంలో TCS నుండి నేర్చుకుంటున్న కాగ్నిజెంట్! మరేం చేయనుంది?
ప్రకటించిన రుణాలు 50 శాతం లేదా అంతకుమించి పెరిగినందున, బడ్జెట్లో ఆర్థిక లోటు లక్ష్యంలో పెరుగుదల ఉంటుందని భావించవచ్చునన్నారు. కరోనా మహమ్మారి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం సవరించే అవకాశముందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.4.2 ట్రిలియన్ల స్థూల రుణాలు తీసుకోవాలని కేంద్రం భావించిందన్నారు. దీంతో రుణాలు రూ.12 ట్రిలియన్లకు చేరుకుంటుందన్నారు.
అంతకుముందు జీఎస్డీపీలో రుణాలు 3 శాతం నుండి 5 శాతం వరకు తీసుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతించాయి. తీసుకునే రుణాలు ఆదాయాల అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్రం, రాష్ట్రాల ఆదాయాలు తక్కువగా ఉన్నాయని, అలాగే ఖర్చులు పెరుగుతున్నాయని అరవింద్ సుబ్రమణియన్ తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో ఆర్థిక సంకోచం భారీగా తగ్గుతుందని సుబ్రమణియమ్ అన్నారు. లాక్ డౌన్ ప్రారంభంలో వృద్ధి రేటు 1.5 శాతం నుండి 2 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అంతకుమించి ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా - లాక్ డౌన్ ప్రభావం సంవత్సరం చివరి భాగంలో