జీఎస్టీ అమలు తర్వాత ప్రజలు చెల్లించాల్సిన పన్ను రేట్లు తగ్గాయని, పన్నుల నిబంధనలను పాటించేవారి సంఖ్య పెరిగింది. అంతకుముందు వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్ వంటివి ఉండగా, అవన్నీ కలిపి ముప్పై ఒక శాతం వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు వివిధ వస్తువులపై ప్రజల మీద భారం తగ్గింది. 2017 జూలై 1వ తేదీ అర్ధరాత్రి నుండి భారత పన్నుల వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు వచ్చింది. భారత్ ఒకే మార్కెట్గా ఆవిర్భవించింది.

200 వస్తువులపై పన్ను తగ్గింపు, రియల్ రంగానికి ఊతం
జీఎస్టీ ప్రారంభంలో 230 వరకు వస్తువులు 28 శాతం స్లాబ్లో ఉండగా, ఇప్పుడు కేవలం 29 వస్తువులు మాత్రమే ఉన్నాయి. అంటే 200 వస్తువులను తక్కువ స్లాబ్లోకి మార్చారు. గృహ నిర్మాణరంగంపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. అందుబాటు గృహాలకైతే జీఎస్టీ 1 శాతంగానే ఉంది. జీఎస్టీలో ఎలాంటి ప్రక్రియ అయినా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ విధానంలో చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 50 కోట్ల రిటర్న్స్ ఆన్ లైన్ ద్వారా దాఖలయ్యాయి. 141 కోట్ల ఈ-వే బిల్లులు తీసుకున్నారు.

రూ.40 లక్షల టర్నోవర్ వరకు జీఎస్టీ మినహాయింపు
రూ.40 లక్షల వరకు టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. తొలుత ఇది రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు రెండింతలకు పెంచారు. అలాగే రూ.1.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం 1 శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది.

స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ
2017 జూలై 1న మన దేశంలో బహుళ పన్నుల వ్యవస్థకు తెరపడింది! జీఎస్టీ సరళీకరిస్తుండటంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017-18 (జూలై-మార్చి) 9 నెలల కాలంలో సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు కాగా, 2018-19లో సగటున నెలకు ఆదాయం 10% పెరిగి రూ.97,100 కోట్లకు చేరుకుంది. 2019-20లో రూ.1 లక్ష కోట్లు దాటింది. రేటు తగ్గింపు, కొన్ని సడలింపులు ఇస్తున్నప్పటికీ జీఎస్టీ ఆదాయం స్థిరంగా పెరిగింది. అయితే గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా వల్ల జీఎస్టీ ఆదాయం తగ్గింది.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications