న్యూఢిల్లీ: పార్లమెంటులో శనివారం బడ్జెట్ 2020ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్రమంత్రి.. చివరి రెండు పేజీలు మిగిలి ఉండగానే తన బడ్జెట్ ప్రసంగాన్ని నిలిపివేశారు.

స్వల్ప అస్వస్థకు గురైన నిర్మలా
బడ్జెట్పై దాదాపు రెండున్నర గంటలకంటే ఎక్కువసేపు ప్రసంగించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ తగ్గడంతో ఆమె నుదుటిపై చెమటలు పట్టాయి. ఈ క్రమంలో ఆమె కొంత ఇబ్బంది పడ్డారు. తోటి మంత్రులు ఆమెకు చక్కెర, నీటిని అందించినా ఆమె నిరాకరించారు.

స్పీకర్కు విన్నపం..
ఇక ప్రసంగాన్ని కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో.. మిగిలిన ప్రసంగాన్ని కూడా చదివినిట్లుగా పరిగణించాలని స్పీకర్ను నిర్మలా సీతారామన్ కోరారు. ఇంకా రెండు పేజీలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆమె అభ్యర్థనకు అంగీకరించారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా థమ్సప్ సంకేతం చూపారు.

రికార్డు బడ్జెట్ ప్రసంగం
నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురైనట్లు గుర్తించి పలువురు ఎంపీలు ఆమె దగ్గరకు వచ్చి పరామర్శించారు. కాగా, బడ్జెట్ ప్రసంగాల్లో తాజా బడ్జెట్ ప్రసంగమే సుదీర్ఘమైనది కావడం గమనార్హం. సుమారు 2.40గంటలపాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. అంతకుముందు 2019 జులైలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో సుమారు 2గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించి అప్పుడు కూడా నిర్మలా రికార్డు సృష్టించారు.

తన రికార్డును తిరగరాసిన నిర్మలా సీతారామన్..
గత రికార్డును తాజాగా నిర్మలా సీతారామన్ బ్రేక్ చేశారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ బడ్జెట్ పత్రాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రాజ్యసభను ఛైర్మన్ వెంకయ్యనాయుడు సోమవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ బడ్జెట్లో రక్షణ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా, వైద్యానికి పెద్ద పీట వేశారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఎక్కువగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆదాయపుపన్ను శ్లాబులను మార్పు చేసి వేతన జీవులకు కొంత ఊరట కల్పించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications