కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఉద్యోగాల్లో కోత లేదా శాలరీ కోతలు చేపట్టాయి. వేతన పెంపు, కొత్త ఉద్యోగులను తీసుకోవడం అతి కొన్ని సంస్థల్లో తప్ప ఎక్కువ సంస్థలు ఆర్థికంగా చితికిపోయాయి. దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాల కోత, శాలరీ కోతలు చేపట్టాయి. ప్రముఖ ఆటోమేకర్ బీఎండబ్ల్యు 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

కరోనా.. ముందస్తు ఉద్యోగ విరమణ ఒప్పందం
ఈ జపాన్ దిగ్గజ బీఎండబ్ల్యు ముందస్తు పదవీ విరమణపై ఈ ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వార్షిక టర్నోవర్తో పాటు కరోనా కారణంగా సేల్స్ భారీగా పడిపోయాయి. మందగమనం, మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ ముందస్తు పదవి విరమణపై ఇప్పటికే ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా వెల్లడించింది.

యువతకు జాబ్ గ్యారెంటీతో..
బీఎండబ్ల్యు హెడ్ ఆఫీస్ జపాన్లోని మ్యూనిచ్లో ఉంది. ఇది X5 SUV, 3 సిరీస్ సెడాన్ వంటి అత్యాధునిక కార్లను తయారు చేస్తుంది. ముందస్తు ఉద్యోగ విరమణకు ఉద్యోగ ప్రతినిధులు అంగీకరించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా దాదాపు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారిపై దృష్టి సారించింది. ఇక, యువతకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం అందిస్తుంది. ఉన్నత విద్య అనంతరం జాబ్ గ్యారెంటీ కూడా ఉంటుంది.

5 శాతం ఉద్యోగుల తొలగింత
ప్రపంచంలో బీఎండబ్ల్యు ఉద్యోగులు 1,26,000 మంది ఉన్నారు. 6,000 మంది ఉద్యోగుల తొలగింత అంటే 5 శాతం కంటే తక్కువ అని వెల్లడించింది. వైరస్ కారణంగా ఆర్థిక నష్టాలతో పాటు యూరోప్ ప్రాంతంలో కొత్త కార్లకు డిమాండ్ మందగించినట్లు తెలిపింది. కరోనా సహా వివిధ కారణాలతో గత మే నెలలో సేల్స్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. యూరోపియన్ యూనియన్లో సేల్స్ 52 శాతం పడిపోయాయి. ఏప్రిల్ నెలలో అయితే ఏకంగా 78.3 శాతం క్షీణించాయి.

ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు
కరోనా నేపథ్యంలో 1,26,000 ఉద్యోగుల్లో 30,000 మంది ఉద్యోగులను గంటల చొప్పున ఉపయోగించుకుంది బీఎండబ్ల్యు. ఉద్యోగులకు జర్మనీ ప్రభుత్వం వేతనంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. కాగా, బీఎండబ్ల్యు తొలగించే ఉద్యోగాలు అన్నీ కూడా దాదాపు జర్మనీలోనే ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెండ్గా విక్రమ్ పవా నియమితులయ్యారు. బీఎండబ్ల్యు గ్రూప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆయన అధనంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications