క్రిమిసంహారక పరిష్కారం కోసం మైక్రోవేవ్ టెక్నాలజీపై పని చేస్తున్న ఏకైక భారతీయ వైద్య MSME మాసర్, కరోనా వ్యాప్తి సమయంలో ఉపరితలాలు, పరిసరాలు మరియు ఏరోసోల్లను క్రిమిరహితం చేయటానికి అతుల్యా అనే కొత్త ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ ఎంపీ వికాస్ మహాత్మే, బీజేవైఎం నాగపూర్ అధ్యక్షులు శివాని డాని వఖ్రే ఆధ్వర్యంలో దీనిని ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఉత్పత్తిని ప్రారంభించినట్లు నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఈ కంపెనీ తెలిపింది. వైరస్, బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేయడానికి మైక్రోవేవ్ టెక్నాలజీపై అతుల్యా పని చేస్తోందన్నారు.
పూణేలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(DIAT) అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంపై అతుల్యా నడుస్తుంది. స్టెరిలైజర్ హ్యాండ్హెల్డ్ పరికరంగా పని చేస్తుంది. ఆకారం, పరిమాణాన్ని బట్టి పేటెంట్ పొందిన స్మార్ట్ టెక్నాలజీతో 30 సెకన్ల నుండి 1 నిమిషం లోపల వస్తువులు, ఉపరితలాలు, పరిసరాలు మరియు ఏరోసోల్లను క్రిమిరహితం చేసే సామర్ధ్యం ఉంటుంది. ఇది 56-60 పరిధిలో చల్లని స్టెరిలైజేషన్ను అనుమతిస్తుంది. ఉత్పత్తి యొక్క 4.5 కిలోల మోడల్ 5 amp అనుసంధాన విద్యుత్ సరఫరాపై నడుస్తుంది. పోర్టబుల్ బ్యాటరీ వెర్షన్ను అభివృద్ధి చేయడానికి కూడా కంపెనీ కృషి చేస్తోంది.

తాము ఎల్లప్పుడూ క్రిమిసంహారక, క్రిమిరహితం ద్వారా ప్రజల భద్రతను నిర్ధారించే పరిష్కారాలపై పని చేస్తున్నామని, ఇందుకు DIAT((DRDO)తో అనుబంధానికి దారితీసి, ఆ తర్వాత సురక్షిత పరిసరాన్ని అందించే అతుల్య స్టెరిలైజర్ను పరిచయం చేసిందని మాసర్ టెక్నాలజీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ మోనిష్ భండారీ అన్నారు. మైక్రోవేవ్ టెక్నాలజీ కరోనా సమయంలో వైరస్ను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. అతుల్య చేసిన అర నిమిషంలో సాధారణ స్కాన్ 5 మీటర్ల లోతు వరకు ఏదైనా ఉపరితలాన్ని క్రిమిరహితం చేస్తుందని, తద్వారా కరోనా వంటి వైరస్, ఇతర బ్యాక్టీరియాలను తొలగిస్తుందన్నారు. దీనికి 5 మీటర్ల వరకు చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది.
మనమంతా కరోనాతో పోరాడుతున్నామని, ఇలాంటి సమయంలో వోకల్ ఫర్ లోకల్ పేరుతో సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రభుత్వ ఈ-మార్కెట్ సేకరణ పోర్టల్ (https://gem.gov.in/), ఇ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.12,700. పన్నులు అదనం.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications