ముంబై: దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 1 ఏప్రిల్ 2020 నుంచి ఆయన చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. ఈ మేరకు M&M కంపెనీ బోర్డు ఆనంద్ మహీంద్రా పాత్రను చైర్మన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాత్రకు అప్రూవ్ చేసింది.
నాయకత్వ మార్పు ప్రణాళికను తమ కంపెనీ బోర్డు ప్రకటించిందని, ఇందుకు ఆనందంగా ఉందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బోర్డుకు, నామినేషన్ కమిటీకి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. M&M మేనేజింగ్ డైరెక్టర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (CEO) పవన్ గోయెంకాను ప్రమోట్ చేస్తున్నట్లు, ఇది 1 ఏప్రిల్ 2020 నుంచి అమలులోకి వస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్చేంజ్కు ఇచ్చిన ఫైలింగ్లో తెలిపింది.

అలాగే, సీపీ గుర్నానీ 15 ఏప్రిల్ 2020 నుంచి అడిషనల్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కంపెనీ మరుసటి ఏజీఎం వరకు ఆయన ఉంటారు. వచ్చే ఏడాది నవంబర్ నెలలో ఆయన టర్మ్ ముగిసిన అనంతరం 1 ఏప్రిల్ 2021 వరకు మళ్లీ అపాయింట్ చేయనున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications