1 ఏప్రిల్ 2020న గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్రా
ముంబై: దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. 1 ఏప్రిల్ 2020 నుంచి ఆయన చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. ఈ మేరకు M&M కంపెనీ బోర్డు ఆనంద్ మహీంద్రా పాత్రను చైర్మన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాత్రకు అప్రూవ్ చేసింది.
Delighted to announce our leadership transition plan which reflects the Group’s commitment to good governance. I am grateful to the board & nominations committee for conducting a diligent & rigorous year-long process that will ensure a seamless transition https://t.co/iw34PPxmCg
— anand mahindra (@anandmahindra) December 20, 2019
నాయకత్వ మార్పు ప్రణాళికను తమ కంపెనీ బోర్డు ప్రకటించిందని, ఇందుకు ఆనందంగా ఉందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బోర్డుకు, నామినేషన్ కమిటీకి ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. M&M మేనేజింగ్ డైరెక్టర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (CEO) పవన్ గోయెంకాను ప్రమోట్ చేస్తున్నట్లు, ఇది 1 ఏప్రిల్ 2020 నుంచి అమలులోకి వస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్చేంజ్కు ఇచ్చిన ఫైలింగ్లో తెలిపింది.
ఉద్యోగులకు ఓయో షాక్, 2,000 ఉద్యోగాల కోత!
అలాగే, సీపీ గుర్నానీ 15 ఏప్రిల్ 2020 నుంచి అడిషనల్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కంపెనీ మరుసటి ఏజీఎం వరకు ఆయన ఉంటారు. వచ్చే ఏడాది నవంబర్ నెలలో ఆయన టర్మ్ ముగిసిన అనంతరం 1 ఏప్రిల్ 2021 వరకు మళ్లీ అపాయింట్ చేయనున్నారు.