న్యూఢిల్లీ: ఇండియాలో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెడతామని అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై చిన్న వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు భారత ఈ-కామర్స్ నిబంధనలు ఉల్లంఘించి భారీ ఆఫర్లతో చిరు సంస్థలను దెబ్బతీస్తున్నాయని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ పెట్టుబడులపై స్పందించారు.

భారీ ఆఫర్లు ఇస్తే నష్టం రాదా..?
రూ.7,100 కోట్ల భారీ పెట్టుబడుల ద్వారా అమెజాన్ భారత్కు పెద్ద ఉపకారం ఏమీ చేయడంలేదని పీయుష్ గోయల్ అన్నారు. పోటీ సంస్థల్ని దెబ్బతీసేందుకు భారీ ఆఫర్ల పేరుతో తక్కువ ధరలకు విక్రయిస్తుంటే నష్టాలు రాకుండా లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

అది కుదరదు..
ఈ-కామర్స్ కంపెనీలు భారత చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టాలలోని లొసుగులను అడ్డు పెట్టుకొని మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి దొడ్డదారిన చొరబడదామని భావిస్తే అది కుదరదని స్పష్టం చేశారు.

గొప్ప సాయం ఏమీ చేయడం లేదు
పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్కు అమెజాన్ గొప్ప సాయం చేయడం లేదని దయచేసి లేఖ, మరియు చట్టస్ఫూర్తిని అనుసరించాలని, లొసుగులను కనుగొనేందుకు ప్రయత్నాలు చేయవద్దని తాను పెట్టుబడిదారులకు సూచించానని గోయల్ చెప్పారు.

ప్రతి ఏడాది బిలియన్ డాలర్లు కోల్పోతుంటే..
వారు ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టవచ్చునని, కానీ వారు ప్రతి ఏడాది ఓ బిలియన్ డాలర్లను కోల్పోతుంటే వారు సరదాగా బిలియన్ డాలర్లకు ఫైనాన్స్ (ఆర్థిక సాయం) చేయవచ్చునని, కానీ వారు పెట్టుబడులు పెడుతున్నారని, అలాంటప్పుడు భారత్కు సాయం చేస్తున్నట్లు ఏమీ కాదని చెప్పారు. కాగా, ఇండియాలో పర్యటిస్తున్న జెఫ్ బెజోస్ ప్రభుత్వ వర్గాలతో కూడా సమావేశం కానున్న నేపథ్యంలో పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యంగా మారాయి.

'ఈ-కామర్స్ మార్కెట్
'ఈ-కామర్స్ మార్కెట్ కొనుగోలుదారులు, విక్రేతల్ని అనుసంధానం చేసే ఐటీ ప్లాట్ ఫాం మాత్రమేనని, ఇలాంటి ప్లాట్ ఫాం అందించే సంస్థకు ఎందుకు భారీ నష్టాలు వస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరముందని, ఇండియాలో ఆ సంస్థ బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉండవచ్చునని, ఆ క్రమంలో బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాలు వస్తే వాటిని కూడా భరించక తప్పదని, పెట్టుబడుల ద్వారా భారత్కు ఆ సంస్థ ఏదో సహకరిస్తుందని అనుకోవద్దు' అన్నారు.

సందేహాలు కలుగుతాయి..
సరైన విధానాలు పాటిస్తూ పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన కంపెనీ బిలియన్ డాలర్ల కొద్ది నష్టాలు నమోదు చేస్తుందంటే సందేహాలు కలుగుతాయని, అనుచిత వ్యాపార విధానాలో లేదా పోటీ సంస్థల్ని దెబ్బతీసేటువంటి రేట్లతో అమ్మడం వల్లనే భారీ నష్టాలు వస్తాయని గోయల్ అన్నారు. అధికారుల విచారణలో ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరకగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారీ డిస్కౌంట్స్, విక్రేతలతో ఒప్పందాలు వంటి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయనే ఆరోపణలపై అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీద CCI విచారణకు ఆదేశించింది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications