వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో అగ్రదేశం అంటే అమెరికా గుర్తుకు వస్తుంది. దీనిని పెద్దన్న అని సంబోధిస్తారు. ఈ దేశంలో ఉన్నంతమంది సూపర్ రిచ్ మరే దేశంలోను ఉండరు. కానీ ఈసారి అగ్రదేశాన్ని చైనా దాటేసింది. అత్యధిక మిలియనీర్లు ఉన్న దేశాల్లో ఇప్పటి వరకు అమెరికా మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు చైనా దానిని వెనక్కి నెట్టింది. ఈ మేరకు స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ నివేదిక సోమవారం తెలిపింది. 2019 హాఫ్ ఇయర్కు గాను ఈ రిపోర్ట్ వచ్చింది.
ఈ నివేదిక ప్రకారం 100 మిలియన్ల చైనీయుల వద్ద 10 శాతం సంపదన ఉంది. అదే సమయంలో అమెరికాలో 99 మిలియన్లు ఉంది. గత కొన్నాళ్లుగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఓ వైపు గత 12 నెలలుగా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రెండు దేశాలు కూడా వెల్త్ క్రియేషన్లో ముందున్నాయి. అమెరికా, చైనాలు వరుసగా 3.8 ట్రిలియన్ డాలర్లు, 1.9 ట్రిలియన్ డాలర్లతో ఉన్నట్లుగా ఓ నివేదిక తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల ర్యాంకులు 1.1 మిలియన్ నుంచి 46.8 మిలియన్లకు పెరిగింది. వీరి వద్ద 158.3 ట్రిలియన్ డాలర్ల నెట్ వర్త్ ఉంది. వీరి వద్ద ఉన్న సంపద అంతర్జాతీయంగా చూసుకుంటే 44 శాతం. ప్రపంచవ్యాప్తంగా 55,920 మంది అడల్ట్స్ వద్ద 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉంది. 4,830 కంటే ఎక్కువ మంది వద్ద 500 మిలియన్ డాలర్లకు పైగా ఉంది.
ప్రపంచ సంపద వృద్ధి అంచనా గత ఏడాదిలో 2.6 శాతం పెరిగింది. ఇది రానున్న అయిదేళ్లలో 27 శాతం పెరుగుతుందని అంచనా. అంటే 2024 నాటికి 459 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. అలాగే మిలియనీర్ల సంఖ్య 63 మిలియన్లకు చేరుకుంటుందని పేర్కొంది. మిలియనీర్లు కాకుండా మిగతా 90 శాతం ప్రజల వద్ద 18 శాతం సంపద ఉంది. 2000లో ఇది కేవలం 11 శాతం. ఇప్పుడు ఏడు శాతం పెరిగింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications