గోరక్పూర్: దేశంలో పేదరికాన్ని నిర్మూలించగలమనే విశ్వాసం, ఆశలు నింపే ఆర్థిక వాతావరణాన్ని కలిగి ఉండటం మన దేశంలో 300 ఏళ్ల తర్వాత తొలిసారి చూస్తున్నామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి గురువారం నాడు అన్నారు. గోరక్పూర్ (యూపీ)లోని మదన్ మోహన్ మాలవియా యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ (MMMUT)లో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

300 ఏళ్ల తర్వాత మొటిసారి విశ్వాసం..
పేదరికాన్ని నిర్మూలించగలమని, ప్రతి భారతీయుడికి మంచి భవిష్యత్తు సృష్టించగలమనే విశ్వాసం కలిగించే వాతావరణం 300 ఏళ్ల తర్వాత మొదటిసారి ఏర్పడిందని నారాయణమూర్తి అన్నారు. మనం గట్టిగా ప్రయత్నాలు చేస్తే కడు పేదరికంలోని పిల్లల కన్నీళ్లు తుడవగలమని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్నది కూడా ఇదే అన్నారు. ఈ స్నాతకోత్సవంలో యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, MMMUT వైస్ ఛాన్సులర్ నివాస్ సింగ్, యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు, వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.

మేరా భారత్ మహాన్ అంటే దేశభక్తి చాటటం సులభం కానీ..
జాతీయ జెండాను పట్టుకొని మేరా భారత్ మహాన్, జయహో అని నినాదాలు చేయడం చాలా సులభమని, కానీ విలువలు పాటించడం మాత్రం చాలా కష్టమని నారాయణమూర్తి అన్నారు. ఈ దేశం కోసం ప్రతి పౌరుడు తనకు తోచిన ఉత్తమ సేవలు అందించడమే అసలు దేశభక్తి అన్నారు. దేశం కోసం పని చేయడమే దేశభక్తి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి దేశంకోసం పని చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ దేశభక్తే
మనం మన వ్యక్తిగత ఆసక్తులను, ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశ కోసం పని చేయగలగాలని నారాయణమూర్తి అన్నారు. దేశం కోసం ఈర్షా, ద్వేషాలను పక్కన పెట్టాలన్నారు. సామాజిక శ్రేయస్సు కోసం వివిధ రంగాల్లో ఉత్సాహంతో, చిత్తశుద్ధితో పని చేయడం కూడా దేశభక్తే అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మనం నిరంతరం మనకంటే మెరుగైన దేశాలతో పోల్చుకోవడంతో పాటు వాటి నుంచి నేర్చుకోవాలని నారాయణమూర్తి అన్నారు. ఉదాసీనతను పక్కన పెట్టి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్: వారానికి 4 రోజులు ఆఫీసు నుంచే పని తప్పనిసరి! హైబ్రిడ్ మోడల్కు ముగింపు పలికిన కంపెనీ

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications