గోరక్పూర్: దేశంలో పేదరికాన్ని నిర్మూలించగలమనే విశ్వాసం, ఆశలు నింపే ఆర్థిక వాతావరణాన్ని కలిగి ఉండటం మన దేశంలో 300 ఏళ్ల తర్వాత తొలిసారి చూస్తున్నామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి గురువారం నాడు అన్నారు. గోరక్పూర్ (యూపీ)లోని మదన్ మోహన్ మాలవియా యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ (MMMUT)లో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

300 ఏళ్ల తర్వాత మొటిసారి విశ్వాసం..
పేదరికాన్ని నిర్మూలించగలమని, ప్రతి భారతీయుడికి మంచి భవిష్యత్తు సృష్టించగలమనే విశ్వాసం కలిగించే వాతావరణం 300 ఏళ్ల తర్వాత మొదటిసారి ఏర్పడిందని నారాయణమూర్తి అన్నారు. మనం గట్టిగా ప్రయత్నాలు చేస్తే కడు పేదరికంలోని పిల్లల కన్నీళ్లు తుడవగలమని చెప్పారు. జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్నది కూడా ఇదే అన్నారు. ఈ స్నాతకోత్సవంలో యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, MMMUT వైస్ ఛాన్సులర్ నివాస్ సింగ్, యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు, వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.

మేరా భారత్ మహాన్ అంటే దేశభక్తి చాటటం సులభం కానీ..
జాతీయ జెండాను పట్టుకొని మేరా భారత్ మహాన్, జయహో అని నినాదాలు చేయడం చాలా సులభమని, కానీ విలువలు పాటించడం మాత్రం చాలా కష్టమని నారాయణమూర్తి అన్నారు. ఈ దేశం కోసం ప్రతి పౌరుడు తనకు తోచిన ఉత్తమ సేవలు అందించడమే అసలు దేశభక్తి అన్నారు. దేశం కోసం పని చేయడమే దేశభక్తి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి దేశంకోసం పని చేయాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ దేశభక్తే
మనం మన వ్యక్తిగత ఆసక్తులను, ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశ కోసం పని చేయగలగాలని నారాయణమూర్తి అన్నారు. దేశం కోసం ఈర్షా, ద్వేషాలను పక్కన పెట్టాలన్నారు. సామాజిక శ్రేయస్సు కోసం వివిధ రంగాల్లో ఉత్సాహంతో, చిత్తశుద్ధితో పని చేయడం కూడా దేశభక్తే అన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మనం నిరంతరం మనకంటే మెరుగైన దేశాలతో పోల్చుకోవడంతో పాటు వాటి నుంచి నేర్చుకోవాలని నారాయణమూర్తి అన్నారు. ఉదాసీనతను పక్కన పెట్టి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications