గత ఏడాది కాలంగా ఐటీ ఉద్యోగులకు కష్టకాలం నడుస్తోంది. ఒకవైపు ఏఐ రాక, మరోవైపు ఉద్యోగాల కోత, జీతాల పెంపులో జాప్యం వంటి వరుస సమస్యలతో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది.
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసేందుకు (వర్క్ ఫ్రమ్ హోమ్) అనుమతి ఇచ్చాయి. మహమ్మారి ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరాయి. కానీ చాలా మంది ఉద్యోగులు దీనికి అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో, టీసీఎస్ వంటి అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, భారత ఐటీ కంపెనీలలో ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తూ వచ్చింది. ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీసుకు వచ్చి, మిగతా రోజులు ఇంటి నుంచి పని చేయవచ్చని ప్రకటించింది.

అయితే, కొన్ని నెలల క్రితం 'జాబ్ లెవెల్ 7' స్థాయిలో ఉన్న ఉద్యోగులు వారానికి 4 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ప్రకటించింది. ఇప్పుడు తాజాగా 'జాబ్ లెవెల్ 6 ప్లస్' స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేసింది.
మొదట సీనియర్ మేనేజర్లు, డెలివరీ మేనేజర్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి అధికారులు వారానికి నాలుగు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించింది. ఇప్పుడు 'జాబ్ లెవెల్ 6 ప్లస్' కేటగిరీలోని ఉద్యోగులు కూడా వారానికి నాలుగు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
ఈ నిబంధనను దశలవారీగా ఉద్యోగులందరికీ వర్తింపజేస్తారని సమాచారం. ఇకపై మీరు వారానికి నాలుగు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని మానవ వనరుల (హెచ్ఆర్) అధికారులు ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో స్పష్టం చేశారు. ప్రతి నెలా ఎంతమంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారనే డేటాను హెచ్ఆర్ అధికారులు సమీక్షిస్తారని కూడా అందులో పేర్కొన్నారు.
మొదట్లో నెలలో వరుసగా 10 రోజులు ఆఫీసుకు వస్తే సరిపోతుందని ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ ఇప్పుడు, ఆ 10 రోజులను నెలలోని ప్రతీ వారానికి విభజించుకోవాలని, అంటే ప్రతీ వారం ఆఫీసుకు రావాల్సిందేనని సీనియర్ అధికారులు జూనియర్లకు చెబుతున్నారట. దీన్నిబట్టి చూస్తే, ఇన్ఫోసిస్ కూడా క్రమంగా ఉద్యోగులందరినీ ఆఫీసుకు రప్పించే ప్రక్రియను వేగవంతం చేసిందని స్పష్టమవుతోంది. ఇప్పటికే జనవరి నెలలో, ఇంటి నుంచి పని చేసే రోజుల పొడిగింపునకు ఇన్ఫోసిస్ కఠినమైన నిబంధనలను జారీ చేసిన విషయం తెలిసిందే.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications