న్యూఢిల్లీ: ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు (MAHSR) ప్రాజెక్టు 2023 వరకు పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. 508 కిలో మీటర్లన పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుతవం ప్రత్యేక ప్రయోజనం కింద నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) పేరుతో దీనిని చేపడుతున్నామన్నారు.

జపాన్ ఆర్థిక, టెక్నికల్ సహకారంతో...
ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం ఆర్థికంగా, టెక్నికల్గా సహకారం అందిస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు అన్నారు. ఇందులో రూ.3226.8 కోట్లను ఈ ఏడాది జూన్ వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టుల విస్తరణపై గోయల్ మాట్లాడుతూ.. వీటికి పెద్ద ఎత్తున నిధులు కావాలని, అదే విధంగా భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం కావాలన్నారు. ఇందుకు అనువైన పరిస్థితులు ఏర్పడితే మిగతా చోట్ల ఈ ప్రాజెక్టులు చేపడతామన్నారు.

జపాన్ ప్రధాని అడ్వైజర్తో గోయల్ భేటీ
ఇదిలా ఉండగా, జపాన్ ప్రధాని షింజో అబే స్పెషల్ అడ్వైజర్ హీరోటో ఇజుమిని పీయూష్ గోయల్ కలిశారు. వీరి మధ్య ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు విషయమై చర్చ జరిగింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే అధికారులు వీరు భేటీ అయి, హైస్పీడ్ రైలుపై చర్చించారని చెప్పారు.

ఏడు గంటల నుంచి రెండు గంటలకు...
ఈ ప్రాజెక్టు కోసం NHSRCL గత నెల వరకు 1,380 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే 39 శాతం ల్యాండ్ను అక్వైర్ చేసుకుంది. ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా. ముంబై - అహ్మదాబాద్ మధ్య ఉన్న 508 కిలో మీటర్ల దూరాన్ని ఇది రెండు గంటల్లోపు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రూట్లో రైళ్లు అయితే ఏడు గంటలు, విమానాలు అయితే ఒక గంట సమయం తీసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 14, 2017లో రూ.1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications