న్యూఢిల్లీ: ముంబై - అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు (MAHSR) ప్రాజెక్టు 2023 వరకు పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. 508 కిలో మీటర్లన పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుతవం ప్రత్యేక ప్రయోజనం కింద నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) పేరుతో దీనిని చేపడుతున్నామన్నారు.

జపాన్ ఆర్థిక, టెక్నికల్ సహకారంతో...
ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం ఆర్థికంగా, టెక్నికల్గా సహకారం అందిస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు అన్నారు. ఇందులో రూ.3226.8 కోట్లను ఈ ఏడాది జూన్ వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టుల విస్తరణపై గోయల్ మాట్లాడుతూ.. వీటికి పెద్ద ఎత్తున నిధులు కావాలని, అదే విధంగా భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం కావాలన్నారు. ఇందుకు అనువైన పరిస్థితులు ఏర్పడితే మిగతా చోట్ల ఈ ప్రాజెక్టులు చేపడతామన్నారు.

జపాన్ ప్రధాని అడ్వైజర్తో గోయల్ భేటీ
ఇదిలా ఉండగా, జపాన్ ప్రధాని షింజో అబే స్పెషల్ అడ్వైజర్ హీరోటో ఇజుమిని పీయూష్ గోయల్ కలిశారు. వీరి మధ్య ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలు విషయమై చర్చ జరిగింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే అధికారులు వీరు భేటీ అయి, హైస్పీడ్ రైలుపై చర్చించారని చెప్పారు.

ఏడు గంటల నుంచి రెండు గంటలకు...
ఈ ప్రాజెక్టు కోసం NHSRCL గత నెల వరకు 1,380 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుంది. అంటే 39 శాతం ల్యాండ్ను అక్వైర్ చేసుకుంది. ఈ బుల్లెట్ రైలు గంటకు 320 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా. ముంబై - అహ్మదాబాద్ మధ్య ఉన్న 508 కిలో మీటర్ల దూరాన్ని ఇది రెండు గంటల్లోపు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రూట్లో రైళ్లు అయితే ఏడు గంటలు, విమానాలు అయితే ఒక గంట సమయం తీసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబే సెప్టెంబర్ 14, 2017లో రూ.1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications