న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. IMPS ట్రాన్సాక్షన్లపై ఛార్జీలను ఆగస్ట్ 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీఐ స్పష్టం చేసింది. రోజులో ఏ క్షణమైనా డబ్బులు ట్రాన్సుఫర్ చేసేందుకు IMPS ఉపయోగపడుతుంది. వీటిపై ఇప్పటి వరకు వసూలు చేస్తన్న ఛార్జీలు ఆగస్ట్ నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు ప్రోత్సాహం
ఇప్పటికే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్ (NEFT), యోనో బ్యాంక్ యాప్ పైన ఇప్పటికే ఛార్జీలు వసూలును రద్దు చేసింది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్పై ఆర్బీఐ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు గత నెల ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిని ఎస్బీఐ జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది.

IMPSపై ఇక ఈ ఛార్జీలు ఉండవు
ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారులు ఆగస్ట్్ 1వ తేదీ నుంచి ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీసెస్ (IMPS)పై ఛార్జీలు వసూలు చేయదు. ప్రస్తుతం రూ.1,000 వరకు ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు. రూ.1000-10,000 వరకు 1+జీఎస్టీ, రూ.10,001-1,00,000 వరకు రూ.2+జీఎస్టీ, రూ.1,00,001-2,00,000 వరకు లావాదేవీలపై రూ.3+జీఎస్టీ వసూలు చేస్తోంది.

6 కోట్ల మంది ఎస్బీఐ ఇంటర్నెట్ యూజర్లు
ఎస్బీఐకి 29.7 కోట్ల మంది డెబిట్ కార్డు హోల్డర్స్ ఉండగా, ఇందులో 6 కోట్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్, 1.4 కోట్ మంది మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. యోనో యాప్ను ఒక కోటిమంది కస్టమర్లు ఉపయోగిస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకింగ్ షేర్ 25 శాతంగా ఉంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్బీఐ 18 శాతం వాటా కలిగి ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications