మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు వచ్చి చేరాయి. అయితే ఈ టెక్నాలజీలు మహిళా ఉద్యోగులకు కొత్త సవాళ్లు విసురుతున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం లో చేరే మహిళల తో పాటు, వివిధ కారణాలతో కొంత కాలం ఉద్యోగాలకు దూరంగా ఉన్న మహిళలు కెరీర్ రీ ఎంట్రీ ఇవ్వడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది సారాంశం.
మూడు నాలుగేళ్ల క్రితం వరకు ఇప్పుడు వినిపిస్తున్న టెక్నాలజీలు ఎవరికీ పెద్దగా పరిచయం లేనివే. ఆ సమయం లో ఏదేని కారణం తో ఉద్యోగాలు మానేసిన వారికి , ఇప్పుడు రే ఎంట్రీ అంటే కష్టమే. టెక్నాలజీ మారటమే ఇందుకు ప్రధాన కరంగా చెబుతున్నారు. ఉదాహరణకు రెండు దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ జాబ్స్ ఇప్పుడు ఆటోమేషన్ దిశగా వేగంగా మారిపోయింది. మానుల్ టెస్టింగ్ లో క్యారీ ప్రారంభించి మధ్యలో మానేసిన మహిళా ఉద్యోగులకు ఇప్పుడు ఆటోమేషన్ రంగ ప్రవేశం తో కొత్తగా వాటిని నేర్చుకోక తప్పనిసరి ఐంది. అలాగే , సాధారణ మార్కెటింగ్ రంగంలో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వేగంగా విస్తరిస్తోంది. ఇలాగె ప్రతీ సెగ్మెంట్ లోనూ కొత్త సవాళ్లు ఎదురు అవుతున్నాయి.

పని ప్రాంతాల్లో జెండర్ ఈక్వాలిటీ ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా బహుళ జాతి కంపెనీలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. అందుకే మధ్యలో ఉద్యోగాలు మానేసిన మహిళలకు మళ్ళీ రే ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, ఐబీఎం , ఇంగెర్సొల్ రాండ్ వంటి కంపెనీలు ప్రధాన వరుసలో ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక ప్రకారం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్యా కేవలం 22% కాగా, పురుషుల నిష్పత్తి 78% ఉండటం ఇదే ట్రెండ్ ను సూచిస్తోందని ఈ పత్రిక వెల్లడించింది.
చెన్నై కి చెందిన అవతార్ గ్రూప్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం భరత్ లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుండగా, అందులో కనీసం 70 లక్షణాలకు పైగా మంది ఉద్యోగాలు వివిధ కారణాలతో మధ్యలో మానేస్తున్నారట. వీరందరికి మళ్ళీ కెరీర్ ను ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
మిగితా రంగాలతో పోలిస్తే సాఫ్ట్ వేర్, ఐటీ రంగం లో మహిళా ఉద్యోగుల సంఖ్యా అధికంగానే ఉంటుంది. ఐనా కూడా కొత్త టెక్నాలజీలు వారికీ సవాళ్లు విసురుతుండటంతో మొత్తంగా జెండర్ ఈక్వాలిటీ దెబ్బతింటోందనేది నిపుణుల మాట.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications