మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, వర్చ్యువల్ రియాలిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు వచ్చి చేరాయి. అయితే ఈ టెక్నాలజీలు మహిళా ఉద్యోగులకు కొత్త సవాళ్లు విసురుతున్నట్లు వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం లో చేరే మహిళల తో పాటు, వివిధ కారణాలతో కొంత కాలం ఉద్యోగాలకు దూరంగా ఉన్న మహిళలు కెరీర్ రీ ఎంట్రీ ఇవ్వడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది సారాంశం.
మూడు నాలుగేళ్ల క్రితం వరకు ఇప్పుడు వినిపిస్తున్న టెక్నాలజీలు ఎవరికీ పెద్దగా పరిచయం లేనివే. ఆ సమయం లో ఏదేని కారణం తో ఉద్యోగాలు మానేసిన వారికి , ఇప్పుడు రే ఎంట్రీ అంటే కష్టమే. టెక్నాలజీ మారటమే ఇందుకు ప్రధాన కరంగా చెబుతున్నారు. ఉదాహరణకు రెండు దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ జాబ్స్ ఇప్పుడు ఆటోమేషన్ దిశగా వేగంగా మారిపోయింది. మానుల్ టెస్టింగ్ లో క్యారీ ప్రారంభించి మధ్యలో మానేసిన మహిళా ఉద్యోగులకు ఇప్పుడు ఆటోమేషన్ రంగ ప్రవేశం తో కొత్తగా వాటిని నేర్చుకోక తప్పనిసరి ఐంది. అలాగే , సాధారణ మార్కెటింగ్ రంగంలో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వేగంగా విస్తరిస్తోంది. ఇలాగె ప్రతీ సెగ్మెంట్ లోనూ కొత్త సవాళ్లు ఎదురు అవుతున్నాయి.

పని ప్రాంతాల్లో జెండర్ ఈక్వాలిటీ ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా బహుళ జాతి కంపెనీలు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. అందుకే మధ్యలో ఉద్యోగాలు మానేసిన మహిళలకు మళ్ళీ రే ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తుంటాయి. ఇందులో మైక్రోసాఫ్ట్, ఐబీఎం , ఇంగెర్సొల్ రాండ్ వంటి కంపెనీలు ప్రధాన వరుసలో ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదిక ప్రకారం ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ రంగంలో మహిళా ఉద్యోగుల సంఖ్యా కేవలం 22% కాగా, పురుషుల నిష్పత్తి 78% ఉండటం ఇదే ట్రెండ్ ను సూచిస్తోందని ఈ పత్రిక వెల్లడించింది.
చెన్నై కి చెందిన అవతార్ గ్రూప్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం భరత్ లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు చేస్తుండగా, అందులో కనీసం 70 లక్షణాలకు పైగా మంది ఉద్యోగాలు వివిధ కారణాలతో మధ్యలో మానేస్తున్నారట. వీరందరికి మళ్ళీ కెరీర్ ను ప్రారంభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
మిగితా రంగాలతో పోలిస్తే సాఫ్ట్ వేర్, ఐటీ రంగం లో మహిళా ఉద్యోగుల సంఖ్యా అధికంగానే ఉంటుంది. ఐనా కూడా కొత్త టెక్నాలజీలు వారికీ సవాళ్లు విసురుతుండటంతో మొత్తంగా జెండర్ ఈక్వాలిటీ దెబ్బతింటోందనేది నిపుణుల మాట.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications