న్యూఢిల్లీ: సేవా నిబంధనల విషయంలో నాణ్యతను విస్మరించినందుకు గాను భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు గతంలో రూ.3,050 కోట్ల జరిమానా విధించారు. 2016 అక్టోబర్లో వచ్చిన కొత్త రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీని నిరాకరించినందుకు టెలికం సంస్థలకు జరిమానా విధించాలని టెలికం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సూచించింది. దీంతో డిపార్టుమెంట్ ఆప్ టెలికం (DOT) రూ.3,050 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు DOT విధించిన జరిమానాను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (DCC) సమర్థించిందని తెలుస్తోంది.
DoT పెనాల్టీని DCC అప్రూవ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు 2.6 శాతం, వొడాఫోన్ ఐడియా షేర్లు 3.8 శాతం తగ్గాయి. కాగా, పెనాల్టీ విధించే ముందు రూ.3,050 కోట్ల జరిమానాపై తిరిగి సమీక్షించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ట్రాయ్ నుంచి అభిప్రాయం తీసుకోనున్నారు.

రిలయన్స్ జియో ఎంట్రీ తర్వాత వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ వంటి టెలికం సర్వీస్ ప్రొవైడర్లు భారీగా దెబ్బతింటున్నారు. మూడేళ్లలోనే రిలయన్స్ జియో.. కస్టమర్ల విషయంలో ఎయిర్టెల్ను దాటి, వొడాఫోన్ ఐడియాకు దరిదాపుల్లో ఉంది. డేటా ప్యాకేజీ, వాయిస్ కాల్స్తో జియో మిగతా టెలికం సంస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది.
ఇదిలా ఉండగా, మొబైల్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూ ట్రాయ్.. పై కంపెనీలకు రూ.3.050 కోట్ల జరిమానా విధించాలని డీఓటీకి సూచించింది. దీని ప్రకారం నాడు.. వొడాఫోన్, ఎయిర్టెల్స పైన రూ.1050 కోట్ల చొప్పున, ఐడియా పైన రూ.950 కోట్ల చొప్పున జరిమానా విధించింది. జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో ఈ కంపెనీలు అప్పుడు మొండికేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications