ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాదు, గత పదేళ్లలో బీఎస్ఎన్ఎల్ కంటే ప్రయివేటు ఆపరేటర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లాయి. మూడేళ్ల క్రితం వచ్చిన రిలయెన్స్ జియో కంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ వెనుకబడి ఉండటం గమనార్హం. గత దశాబ్దకాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని బీఎస్ఎన్ఎల్, ఇతర ప్రయివేటు ప్రొవైడర్ల లెక్కలు చూస్తే వైర్లెస్ మార్కెట్లో ప్రభుత్వరంగ సంస్థ ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతోందని అంటున్నారు.

సగం కంటే ఎక్కవ వాటాను కోల్పోయిన బీఎస్ఎన్ఎల్
గత పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ సగానికంటే ఎక్కువ వైర్లెస్ మార్కెట్ను కోల్పోయిందని లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ప్రయివేటు ఆపరేటర్ల వైపుకు వెళ్లారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ వైర్ లెస్ మార్కెట్ 2009 జూన్లో 15.36 శాతం కాగా, 2018 డిసెంబర్ నాటికి అది 6.82 శాతానికి పడిపోయింది. అదే సమయంలో 2016 సెప్టెంబర్లో వచ్చిన రిలయన్స్ జియో వాటా 19.01 శాతంగా ఉంది. అంటే అప్పుడే వచ్చిన జియో కంటే ఎంతో వెనుకబడి ఉంది.

బీఎస్ఎన్ఎల్ కంటే జియో వాటా ఎక్కువ
2009 జూన్ నాటికి బీఎస్ఎన్ఎల్ గ్రామీణ వైర్లెస్ వాటా 15.36 శాతం ఉండగా, ఎయిర్టెల్ వాటా 26.82, వొడాఫోన్ 19.72, ఐడియా 15.72 శాతంగా ఉంది. 2018 డిసెంబర్ నాటికి బీఎస్ఎన్ఎల్ గ్రామీణ వైర్లెస్ వాటా 6.82 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ప్రయివేటు ఆపరేటర్ల వాటా పెరిగింది. ఎయిర్టెల్ వాటా 31.91 శాతం, వొడాఫోన్ ఐడియా వాటా 41.76 శాతం, రిలయన్స్ జియో వాటా 19.01 శాతంగా ఉంది.

బీఎస్ఎన్ఎల్ తగ్గుదలకు ఎన్నో కారణాలు
బీఎస్ఎన్ఎల్ వైర్ లెస్ క్రమంగా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. నిర్ణయాల్లో ఆలస్యం, ఉద్యోగులకు అధిక వేతనం ఉండటమే కాకుండా మార్కెట్లో తక్కువ నైపుణ్యం (ప్రయివేటు పోటీదారులతో) కలిగి ఉండటం, సమయానుకూలంగా లేదా సకాలంలో విస్తరణ చేయకపోవడం, నెట్ వర్క్ అప్గ్రేడ్ కూడా అలాగే ఉండటం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉదారణకు ప్రయివేటు ఆపరేటర్లతో పోలిస్తే 3జీ సేవలను ఏడాదికి ముందే ప్రారంభించవచ్చు. ఎందుకంటే స్పెక్ట్రం ముందుగానే కేటాయించబడింది. కానీ దానిని క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రయివేటు ఆపరేటర్లు గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశించి యూజర్స్ను సంతృప్తి పరిచాయి. వినూత్న ప్యాకేజీలు ఇచ్చాయి. కానీ బీఎస్ఎన్ఎల్ అలా చేయలేకపోయిందని అంటున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications