2019-20 మధ్యంతర బడ్జెట్లో రైల్వేస్కు రికార్డు స్థాయిలో 1.6 లక్షలు కేటాయించింది మోడీ సర్కార్. ఈ బడ్జెట్ క్రితం ఏడాది అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. పార్లమెంటులో తొలిసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్, 2020 వరకు రూ.64,587 కోట్లు కేటాయింపులు జరిపారు. గతేడాది అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో... రైల్వేలకు కేటాయించిన బడ్జెట్లో అధికశాతం కెపాసిటీ విస్తరణకే వినియోగిస్తామని వెల్లడించారు. ఇక అప్పటి నుంచి రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 18వేల కిలోమీటర్ల రైల్వేలైన్లను రెట్టింపు చేస్తామన్నారు అరుణ్ జైట్లీ. అంతేకాదు మానవరహిత రైల్వే క్రాసింగ్లను ఎత్తివేస్తామని కూడా ప్రకటించడం జరిగింది.
గతేడాది ఇచ్చిన హామీ మేరకే రైల్వేలో దాదాపుగా మానవరహిత లెవెల్ క్రాసింగ్లను మూసివేసినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది వందేభారత్ ఎక్స్ప్రెస్ను పట్టాలెక్కించనున్నామన్నారు. ఇది జరిగితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పీయూష్ గోయల్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ఇంజిన్ రహిత రైలును మనదేశంలోనే తయారు చేస్తామని తద్వారా ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడించారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో రైల్వే సేవలు మరింత విస్తరించాయని చెప్పిన మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం 96.2శాతం వద్ద నిలిచాయని చెప్పారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సేవలను 95శాతానికి పెంచాలనే లక్ష్యం నిర్దేశించుకున్నామని వెల్లడించారు. అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరం రైల్వేలో అత్యంత సురక్షిత ఏడాదిగా రికార్డు అయ్యిందన్నారు. అయితే మధ్యంతర బడ్జెట్లో రైల్వే ఛార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications