మధ్యంతర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ భారీ పన్నుల ఉపశమనాన్ని అందించడం ద్వారా మధ్యతరగతిని ఆకట్టుకున్నాడు.
ముందుగా ఊహించినట్టే బడ్జెట్ లో పలు విధాల అంశాలు ఉండటం గమనార్హం. రైతులకు మరియు పేదలకు పెద్ద ఎత్తున తాయిలాలు ఇచ్చిన తరువాత, మధ్యంతర ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ భారీ పన్నుల ఉపశమనాన్ని అందించడం ద్వారా మధ్యతరగతిని ఆకట్టుకున్నాడు.

పన్నుచెల్లింపుదారులకు
గోయల్ తన తాత్కాలిక బడ్జెట్ 2019 ప్రసంగంలో వ్యక్తుల పన్నుచెల్లింపుదారులకు రూ .5 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపును ప్రకటించారు.
బడ్జెట్ లో ప్రభుత్వం ముక్యంగా రైతులు మరియు మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ దృష్టి సారించిందనే చెప్పవచ్చు.

మధ్యతరగతి ప్రజలు
మధ్యతరగతి ప్రజలు సాంప్రదాయకంగా బిజెపి కి పెద్ద ఓటు బ్యాంకు అని అంటున్నారు. వేతన జీవులకు పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపును రూ.5లక్షల వరకు పెంచింది. ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్న విషయం తెలిసిందే.

వ్యవసాయ రంగానికి
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుతం ప్రకటించిన రుణ మాఫీ ఎదుర్కొనేందుకు మోడి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తాలను అందించిందని భావిస్తున్నారు. కానీ ET బడ్జెట్ సర్వే ఆధారంగా మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఉపశమనం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

ఉద్యోగులకు
పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు వల్ల ఉద్యోగులకు రూ.12,500 వరకు భారం తగ్గుతుంది. సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల ఇన్వెస్ట్మెంట్లు, రూ.5 లక్షల పన్ను మినహాయింపు కలుపుకుంటే మొత్తంగా రూ.6.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. దీని వల్ల 3 కోట్ల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.

పన్ను
ప్రస్తుతం, 2.5 లక్షల రూపాయల వ్యక్తిగత ఆదాయం నుండి పన్ను మినహాయించబడింది. 2.5 నుండి 5 లక్షల రూపాయల మధ్య ఆదాయం 5 శాతం పన్ను వసూలు చేస్తుండగా, 5-10 లక్షల మధ్య 20 శాతం పన్ను విధించబడుతుంది. 10 లక్షల రూపాయల కన్నా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించబడుతుంది.

పరిశ్రమల సభ
5 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు స్థాయిని డబుల్ చేయాలని పరిశ్రమల సభ CII ని కోరింది. 5 లక్షల రూపాయలకు లోబడి ఆదాయం ఉంటే పన్ను మినహాయించాలని అలాగే 5-10 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికీ 10 శాతం కంటే తక్కువ పన్ను విధించాలి అని పరిశ్రమల విభాగం సిఫార్సు చేసింది మరియు రు.10-20 లక్షల మధ్య ఆదాయం కోసం, పన్ను రేటు 20 శాతం ఉండాలి. 20 లక్షల రూపాయలకు పైగా సంపాదించినవారికి 25 శాతం పన్ను విధించాలి అని కోరింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications