న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రైతులకు, సామాన్యులకు, ఆదాయపన్నును రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం ద్వారా.. ఇలా ఎన్నో వరాలు కురిపించింది. ఆదాయపన్ను పరిమితి మినహాయింపు ద్వారా మూడు కోట్ల మందికి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకు రూ.6వేలు ఇవ్వనున్నారు. దీని ద్వారా కనీవినీ ఎరుగని విధంగా 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
పిల్లల చదువు రీత్యా కుటుంబం ఒకచోట తాను మరోచోట ఉండే ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చారు. అటువంటి వారు రెండు చోట్ల ఇళ్లపై చెల్లించే అద్దెలకు మినహాయింపునకు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగులు చెల్లించిన అద్దెకు పన్ను మినహాయింపును రూ.2.4లక్షలకు పెంచారు. మధ్యతరగతి, వేతన జీవులు గృహరుణాల చెల్లింపుల్లో రూ.2లక్షల వరకు పన్ను మినహాయింపును ఇచ్చారు..

ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54 కింద రెండు ఇళ్లపై పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి సంబంధించి రూ.2 కోట్ల వరకు మూలధన లబ్ధి (కేపిటల్స్ గెయిన్స్) నుంచి మినహాయింపు ఉంటుంది. జీవిత కాలంలో ఇది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. అలాగే పేదలకు ఇళ్ల పథకం కింద 2020లోపు రిజిస్టర్ చేసుకొన్న గృహ ప్రాజెక్టులకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
ఎవరికైనా మూడు ఇళ్లు ఉంటే, అందులో మొదటి రెండు ఇళ్లు ఖాళీగా ఉంటే.. అందులో ఒకదానిని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద పరిగణిస్తారు. కేవలం మూడో ఇంటికి మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్క ఇంటికే పరిమితమైంది.
ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు మొత్తం 1.53కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తాత్కాలిక ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2025 నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు 143 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామన్నారు.
22 పంటలకు కనీస మద్దతు ధరను 1.5రెట్లు పెంచామన్నారు. పశుసంవర్థక, మత్స్యశాఖ రైతులకు రెండు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఆరు కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది వరకు ఎనిమిది కోట్ల కుటుంబాలకు కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications