తొలి ప్రైవేట్ కంపెనీగా భారతీ ఎయిర్టెల్ ఘనత
ముంబై: భారతీ ఎయిర్టెల్ అంతర్జాతీయ డెట్ మార్కెట్ ద్వారా దాదాపు రూ. 6000 కోట్లను సమీకరించనుంది. 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన బాండ్ల విక్రయ పథకం బుధవారంతో ముగియడంతో ఈ మొత్తాన్ని సమీకరించనుంది.
ఈ బాండ్ల విక్రయానికి బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్, బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, స్టాండర్డ చార్టర్డ్లను మర్చంట్ బ్యాంకర్లుగా ఎయిర్టెల్ కంపెనీ ఎంచుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఒక దేశీయ ప్రైవేట్ కంపెనీ జరుపుతున్న తొలి అతి పెద్ద బాండ్ల విక్రయం ఇదే కావడం విశేషం.
గతేడాది ఇదే కంపెనీ ఫారెక్స్ డెట్ మార్కెట్లో మూడు సార్లు ఇష్యూలను జారీ చేయడం ద్వారా దాదాపు రూ. 15,000 కోట్లను సమీకరించింది. ఇది ఇలా ఉంటే మదపర్లకు డెట్ బాండ్లను జారీ చేసినట్లు ఎయిర్టెల్ బాంబే స్టాక్ ఎక్సెంజ్కిచ్చిన సమాచారంలో తెలిపింది.
ఇక, ఎయిర్టెల్ కంపెనీ చారీ చేసిన బాండ్ నోట్లకు ఫిచ్ బీబీబీ-ఎన్ అండ్ పీ బీబీబీ, మూడీస్ బీఏఏ3 లు తమ తమ రేటింగ్లను ఇచ్చాయి.