భారత జీడీపీలో ఎంఎస్ఎంఈల సహకారాన్ని ప్రస్తుతం ఉన్న 30 శాతం నుండి 50 శాతానికి పెంచాలని, ఎగుమతులు ప్రస్తుతం ఉన్న 49 శాతం నుండి 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం అన్నారు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ కోసం నీతి ఆయోగ్ నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ అరైస్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

మరో 5 కోట్ల ఉద్యోగాలు
ఎంఎస్ఎంఈ రంగంలో ప్రస్తుతం 11 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయని, రానున్న అయిదేళ్లలో మరో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వం లక్ష్యమని గడ్కరీ అన్నారు. అలాగే దేశ జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా ముప్పై శాతం నుండి యాభై శాతానికి, ఎగుమతులు 49 శాతం నుండి అరవై శాతానికి పెంచడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. వినూత్న ఆలోచనలు, వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వారికి ఎదిగే అవకాశం ఇవ్వాలని చెప్పారు.

కొత్త టెక్నాలజీని ప్రోత్సహించాలి
పలు విభాగాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కొత్త టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. ఈ సందర్భంగా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగపడే అదనపు బియ్యం అంశాన్ని ప్రస్తావించారు. దీని వల్ల ఓ వైపు స్టోరేజ్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు గ్రీన్ ఫ్యూయల్ అందించడానికి ఉపయోగపడుతోందన్నారు. ఆవిష్కరణలలో రిస్క్ సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, కొత్త పరిష్కారాలను కనుగొనడాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇలాంటి సమయంలో బొనఫైడ్ మిస్టేక్స్ ఉంటే రక్షణ ఉండాలన్నారు.

15 రంగాల్లోని సవాళ్లపై దృష్టి
ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ కోసం నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ ఆత్మనిర్భర్ భారత్ అరైస్ అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ వర్చువల్ భేటీలో 15 రంగాలలోని సవాళ్లపై దృష్టి పెట్టేందుకు ఇస్రో, నాలుగు మంత్రిత్వ శాఖలతో నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి పని చేయనుంది. మరోవైపు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్ మోడల్ కింద ప్రయివేటు కన్సల్టెంట్ను నియమిస్తుందని గడ్కరీ మరో సందర్భంలో చెప్పారు. ఇంటెలిజెంట్ ట్రాపిక్ సమస్య పరిష్కారం కోసం పీపీపీ మోడల్ అవసరం ఉందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications