పన్ను చెల్లింపుల్లో సమూల మార్పుల దిశగా దేశం మరోఅడుగు ముందుకేసింది. కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అవినీతికి, వేధింపులకు తావులేని పన్ను విధానమే తమ లక్ష్యమని ప్రకటించిన ప్రధాని మోడీ పారదర్శకమైన, విశ్వసనీయమైన స్వేచ్చాయుత వాతావరణంలో పన్ను చెల్లింపుదారుల హక్కులకు రక్షణ కల్పిస్తామని నిన్న ట్యాక్స్పేయర్ చార్టర్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులు కూడా నిజాయితీగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 'పారదర్శక పన్నువిధానం - నిజాయితీపరులకు గౌరవం' అన్న ట్యాక్స్ పోర్టల్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 130 కోట్ల మంది జనాభాలో కోటిన్నర రెండున్నర కోట్ల మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారన్నారు.

మూడు ప్రధాన అంశాలు
మోడీ ఆవిష్కరించిన పారదర్శక పన్నువిధానంలోని 3 ప్రధాన అంశాలు... అధికారుల్ని కలిసే అవసరం లేకుండా ఆదాయపన్ను మదింపు (ఫేస్లెస్ అసెస్మెంట్), వారికి విజ్ఞప్తి చేసుకునే వీలు కల్పించడం(ఫేస్లెస్ అప్పీల్), పన్నుచెల్లింపుదారుల చార్టర్. పన్ను చెల్లింపుదారులు ఎవరిముందు హాజరు కాకుండానే ట్యాక్స్ చెల్లింపులు చేయవచ్చు. అలాగే ఎవరి ముందు హాజరు కాకుండా అప్పీల్ చేసుకునే సౌకర్యం రానుంది.

ఫేస్లెస్ అసెస్మెంట్ అంటే.. ఇరువురికీ ప్రయోజనం
మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత ఐటీ విభాగం మన ఐటీ రిటర్న్స్, అప్పీల్స్ స్క్రూటినీ, నోటీస్ జారీ, సర్వే, జఫ్తు వంటి అంశాలను చూసుకునేది. స్థానిక అధికారి కీలకంగా ఉండేవారు. తాజా సంస్కరణలతో ఈ విధానం పూర్తిగా మారిపోతుంది. కొత్త విధానంలో ఇకపై స్క్రూటినీ కేసులను దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఏ అధికారికో ర్యాండమ్గా కేటాయిస్తారు. ఆ అధికారి ఎవరో ట్యాక్స్ పేయర్కు తెలిసే అవకాశాలు ఉండవు. అలాగే ఆ అధికారి నుండి వచ్చే ఆదేశాలన్ని మరో రాష్ట్రానికి చెందిన అధికారులు సమీక్షిస్తారు. టీంలో ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ర్యాండమ్గా కంప్యూటరే నిర్ణయిస్తుంది. కృత్రిమ మేధ(AI), డేటా అనలటిక్స్ వంటి టెక్నాలజీ వినియోగంతో స్క్రూటినీని పూర్తి చేస్తారు. దీంతో పన్నుచెల్లింపుదారుకు, ఐటీ విభాగానికీ ప్రయోజనమే. పన్ను చెల్లింపుదారు ఆదాయపు పన్ను శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులపై ప్రత్యేక ఒత్తిడి ఉండదు.

గోప్యంగా..
పన్ను చెల్లింపులకు అయ్యే వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతుంది ట్యాక్స్ పేయర్స్ చార్టర్. దీంతో నిజాయితీగా పన్నులు చెల్లించి దేశ ప్రగతికి తోడ్పడే వారితో పాటు ఆదాయ పన్ను విభాగానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ట్యాక్స్ పేయర్స్ చార్టర్తో...
- ఈ చార్టర్ ప్రకారం.. ట్యాక్స్ పేయర్స్ సమస్యల పరిష్కారంలో అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ఐటీ విభాగం నుండి పొందవచ్చు.
- ప్రత్యేక కారణాలు తప్పితే ప్రతి పన్ను చెల్లింపుదారుడిని నిజాయితీపరుడిగా పరిగణిస్తుంది.
- అప్పీల్స్ విషయంలో నిష్పాక్షిక సమీక్ష వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది.
- ట్యాక్స్ పేయర్కు అవసరమైన కచ్చితమైన సమాచారం అందిస్తుంది.
- ఐటీ ప్రొసీడింగ్కు సంబంధించి చట్ట ప్రకారం నిర్దేశిత సమయంలో నిర్ణయం ఉంటుంది.
- చట్ట ప్రకారం పన్ను బకాయిలు మాత్రమే వసూలు చేస్తుంది.
- అధికారుల వేధింపులు ఉండవు.
- పన్ను చెల్లింపుదారు తనకు నచ్చిన అధీకృత ప్రతినిధిని ఎంచుకోవచ్చు.
- ఫిర్యాదుకు, సమస్యను సకాలంలో పరిష్కరించుకునేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
- పన్ను చెల్లింపుకు అయిన ఖర్చును చట్టం అమలు సందర్భంగా పరిగణలోకి తీసుకుంటుంది.
- ట్యాక్స్ పేయర్స్ చార్టర్లో ప్రభుత్వం, ఐటీ శాఖ పాటించాల్సిన 14 సూత్రాలు, ట్యాక్స్ పేయర్కు ఆరు సూత్రాలు పొందుపరిచారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications