ప్రస్తుతం అందరి చూపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పైన ఉంది. బడ్జెట్ అంటే వేటి ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయనే దానిపై సామాన్యుని దృష్టి ఉంటుంది. అలాగే, వేతనజీవులు అయితే ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. మోడీ ప్రభుత్వం గత బడ్జెట్ సమయంలోనే వేతనజీవులకు మినహాయింపులతో రెండింతలు పెంచి రూ.5 లక్షల వరకు ఇచ్చి భారీ ఊరట ఇచ్చింది. ఓవైపు కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడం, మరోవైపు మందగమనం నేపథ్యంలో ఐటీపై ఏం చేస్తారనే ఆసక్తి నెలకొంది.
ఆదాయపు పన్ను గురించి మరిన్ని కథనాలు

కొత్త స్లాబ్స్ తీసుకువస్తారా?
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా మధ్య తరగతి వర్గాలకు పన్ను భారం తగ్గించేందుకు, తద్వారా వారి దగ్గర మిగులు మొత్తాన్ని పెంచే చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ ఇదివరకు చెప్పారు. కొత్త స్లాబ్స్ను ప్రభుత్వం తీసుకు రానుందా అనేది అందరిలోను మెదులుతున్న ప్రశ్న. కొత్త స్లాబ్స్ వస్తే అది శాలరైడ్కు ప్రయోజనకరంగా ఉంటుందా అనేది చూడాలి.

చాలా ఏళ్లుగా స్లాబ్స్ సవరణ లేదు
చాలా ఏళ్ళుగా స్లాబ్స్లలో సవరణ లేదు. పన్ను పరిమితులను కూడా పెంచలేదు. రిబెట్లు, మినహాయింపులు మాత్రమే ఇచ్చారు. ఈసారి రిబేట్ లాంటి ప్రత్యామ్నాయాలను కాకుండా నేరుగా పన్ను స్లాబ్స్లలో మార్పులు చేస్తే బాగుంటుందనేది ఆర్థిక నిపుణుల సూచన.

ఐదు స్లాబ్స్తో చాలామందికి ప్రయోజనం
పన్నులను 5, 10, 20, 30, 35 శాతం స్లాబ్స్గా తీసుకు రావాల్సి ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 20 శాతం, 30 శాతం స్లాబ్స్ ఉన్నాయి. ఆదాయాన్ని ఐదు స్లాబ్స్గా విభజిస్తే చాలామందికి ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు.

స్లాబ్ మార్చకుండా రూ.5 లక్షలకు పెంచితే...
ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచవలసిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇది రూ.2,50వేలుగా ఉంది. రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను విధిస్తున్నారు. పన్ను వర్తించే ఆధాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు రూ.12,500 ప్రత్యేక రిబేట్ ఉంటుంది. దీంతో కొందరికి లాభం. కానీ ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే చాలామందికి పన్ను భారం తగ్గుతుందని అంటున్నారు.

పన్ను పరిమితి కాకుండా స్లాబ్స్ సవరించినా..
ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచితే చాలామందికి ప్రయోజనమే. అయితే పన్ను పరిమితి పెంచకుండా స్లాబ్స్ సవరించినా చాలామందికి ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు.

రూ.7 లక్షల వరకు ఇస్తే...
ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఉంది. దీనిని రూ.7 లక్షలకు చేస్తారని అంచనా. అంటే రూ.7 లక్షల ఆదాయం వరకు 5 శాతం స్లాబ్లోకి వస్తుంది. బడ్జెట్లో ఈ ఊరట కలిగిస్తే ఎంతోమంది వేతనజీవులకు ఊరట.

స్లాబ్ మారిస్తే రూ.60వేలు ఆదా
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం 20 శాతం ఉండగా, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను ఉండవచ్చునని అంచనా. రూ.10 లక్షల నుంచి ఆ పైన ఆర్జించే వారికి కూడా స్లాబుల్లో మార్పులు ఉండాలని భావిస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయం ఆర్జించే వారికి ప్రతి సంవత్సరం కనీసం రూ.60,000 వరకు పన్ను తగ్గుతుంది. రూ.15 లక్షల ఆదాయం ఉంటే రూ.1.10 లక్షలు, రూ.20 లక్షల ఆదాయం ఉంటే రూ.1.60 లక్షల పన్ను మిగులుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications