మున్ముందు మొబైల్ ఫోన్ వినియోగదారులకు పోర్టబులిటీ మరింత సులభం కానుంది. eSIM (ఈ-సిమ్)తో సులువు అవనుంది. ఎవరికైనా తాము వినియోగిస్తున్న టెలికం ఆపరేటింగ్ సర్వీస్ నచ్చకపోతే మరో టెలికం ఆపరేటింగ్ సర్వీస్లోకి మారడమే పోర్టబులిటీ. త్వరలో రానున్న eSIMతో తమకు నచ్చిన టెలికం ఆపరేటర్కు సులభంగా మారిపోయే అవకాశం అందుబాటులోకి రానుంది.

ప్రస్తుత పద్ధతి ఇది
ప్రస్తుతం ఓ సిమ్ వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ యూజర్లు.. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) ద్వారా తమ నెంబర్ను మార్చుకోకుండానే మరో టెలికం ఆపరేటర్కు మారవచ్చు. దీనికి కొద్ది రోజుల సమయం పడుతుంది. ఇందుకు కనీసం వారం లేదా పది పదిహేను రోజుల సమయం పడుతుంది. ఆపరేటర్ మార్పుకు అభ్యర్థన చేసుకున్న తర్వాత ఆ ఆపరేటర్కు చెందిన స్టోర్లకు వెళ్లి సిమ్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో యాక్టివేషన్కు కొంత సమయం తీసుకుంటుంది. అయితే ఇదంతా అవసరం లేకుండా వేగవంతంగా తమకు నచ్చిన ఆపరేటర్కు మారేందుకు eSIM ఉపయోగపడుతుంది.

ఇదీ... eSIM
eSIM ఒక డిజిటల్ సిమ్ కార్డు. ఇది మొబైల్ ఫోన్తోనే వస్తుంది. దీనిని మొబైల్ నుంచి బయటకు తీయవలసిన అవసరం లేదు. ఫిజికల్ సిమ్ లేకుండానే eSIMతోనే మొబైల్ టారిఫ్ ప్లాన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. నెంబర్ మార్చకుండానే పోర్టబులిటీ ద్వారా మరో టెలికం ఆపరేటర్కు మారే వెసులుబాటు ఉంది. ఇప్పుడు eSIMతో ఇది మరింత సులభం కానుంది. eSIMలను ఎక్కువగా ఐవోటీ, మెషిన్ 2 మెషిన్ సొల్యూషన్స్కు వినియోగిస్తారు.

సిద్ధమన్న ఐడియా, ఎయిర్టెల్
eSIMతో కలిసి పని చేసేందుకు వొడాఫోన్-ఐడియా, ఎయిర్టెల్ సిద్ధమని ప్రకటించాయి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో కంపెనీలు eSIM ఎనేబుల్డ్ యాపిల్ వాచీలను విక్రయించేందుకు ఇప్పటికే యాపిల్తో లింకప్ అయ్యాయి. హైఎండ్ ఫోన్లలోనే eSIM సదుపాయం ఉంటుంది. కాబట్టి వినియోగం ఎక్కువగా లేదు. ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మాక్స్, గూగుల్ పిక్సెల్ 3 వంటి ఫోన్లు eSIM లను సపోర్ట్ చేస్తున్నాయి. మనదేశంలో eSIM కార్డులు ఒక శాతం కంటే తక్కువ. అయితే రానున్న ఆరేళ్లలో అంటే 2025 నాటికి 25 శాతానికి పెరుగుతుందని అంచనా. గత ఏడాది (2018) ప్రపంచ మార్కెట్లో eSIM పరిమాణం 253.8 మిలియన్ డాలర్లుగా ఉంటే రానున్న నాలుగేళ్లలో అంటే 2023 నాటికి 978.3 మిలియన్ డాలర్లకుగా ఉండవచ్చునని అంచనా.

టెలికం కంపెనీలకు ఇబ్బందులే!
eSIM అందుబాటులోకి వస్తే టెలికం ఆపరేటర్లు తమ కస్టమర్లను కాపాడుకునేందుకు లేదా కొత్త కస్టమర్లను సంపాదించుకునేందుకు ఎక్కువ శ్రమించవలసి ఉంటుందని టెలికం కంపెనీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా ఇప్పటికే పోటాపోటీగా ఉన్న టెలికం కంపెనీల వాయిస్కాల్, డేటా యుద్ధం మరింత ఎక్కువ కానుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీల కస్టమర్ కాస్ట్ పెరిగి, లాభాలు మరింత తగ్గుతాయని ఆందోళన చెందుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications