రంగంలోకి ఆర్థిక శాఖ, శాశ్వత బాండ్స్ వ్యాల్యుయేషన్ ప్రమాణాలు సులభతరం
శాశ్వత బాండ్స్గా భావించే అడిషనల్ టైర్-1(AT-1) బాండ్స్ పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేన్ కోసం కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలనే నిబంధనపై మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI) వెనక్కి తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2022 వరకు బేస్-3 ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి పదేళ్లుగా ఉంటుందని, తర్వాత ఆరు నెలల్లో దానిని 20, 30 ఏళ్లకు పెంచుతామని తెలిపింది.
కొత్త నిబంధనలు
దీంతో ఏప్రిల్ 1, 2023 నుండి ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి వంద సంవత్సరాలుగా ఉండనుంది. బేస్-III టైర్ 2 బాండ్స్ కాలపరిమితిని మార్చి 2022 వరకు పదేళ్లుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితి కొనసాగుతుంది. ఏటీ-1 బాండ్స్ వ్యాల్యుయేషన్కు సంబంధించి కొత్త నిబంధనలను సెబి మార్చి 10న విడుదల చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావాలి.
మ్యూచువల్ ఫండ్స్ అభ్యంతరం
వంద ఏళ్ల నిబంధనపై మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పర్పెచ్యువల్ బాండ్స్ రీవ్యాల్యుయేషన్ వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని ఆందోళన చేశాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ సమాఖ్య సెబిని సంప్రదించింది.
రంగంలోకి ఆర్థిక శాఖ
ఆ తర్వాత ఇది వివాదంగా మారింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగి పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేషన్ కోసం జారీ చేసిన వందేళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని సెబిని ఆదేశించింది. వ్యాల్యుయేషన్ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని లేఖలో పేర్కొంది.