శాశ్వత బాండ్స్గా భావించే అడిషనల్ టైర్-1(AT-1) బాండ్స్ పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేన్ కోసం కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలనే నిబంధనపై మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI) వెనక్కి తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2022 వరకు బేస్-3 ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి పదేళ్లుగా ఉంటుందని, తర్వాత ఆరు నెలల్లో దానిని 20, 30 ఏళ్లకు పెంచుతామని తెలిపింది.

కొత్త నిబంధనలు
దీంతో ఏప్రిల్ 1, 2023 నుండి ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి వంద సంవత్సరాలుగా ఉండనుంది. బేస్-III టైర్ 2 బాండ్స్ కాలపరిమితిని మార్చి 2022 వరకు పదేళ్లుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితి కొనసాగుతుంది. ఏటీ-1 బాండ్స్ వ్యాల్యుయేషన్కు సంబంధించి కొత్త నిబంధనలను సెబి మార్చి 10న విడుదల చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావాలి.

మ్యూచువల్ ఫండ్స్ అభ్యంతరం
వంద ఏళ్ల నిబంధనపై మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పర్పెచ్యువల్ బాండ్స్ రీవ్యాల్యుయేషన్ వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని ఆందోళన చేశాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ సమాఖ్య సెబిని సంప్రదించింది.

రంగంలోకి ఆర్థిక శాఖ
ఆ తర్వాత ఇది వివాదంగా మారింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగి పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేషన్ కోసం జారీ చేసిన వందేళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని సెబిని ఆదేశించింది. వ్యాల్యుయేషన్ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని లేఖలో పేర్కొంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications