రంగంలోకి ఆర్థిక శాఖ, శాశ్వత బాండ్స్ వ్యాల్యుయేషన్ ప్రమాణాలు సులభతరం

శాశ్వత బాండ్స్‌గా భావించే అడిషనల్ టైర్-1(AT-1) బాండ్స్ పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేన్ కోసం కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలనే నిబంధనపై మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI) వెనక్కి తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31, 2022 వరకు బేస్-3 ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి పదేళ్లుగా ఉంటుందని, తర్వాత ఆరు నెలల్లో దానిని 20, 30 ఏళ్లకు పెంచుతామని తెలిపింది.

కొత్త నిబంధనలు

కొత్త నిబంధనలు

దీంతో ఏప్రిల్ 1, 2023 నుండి ఏటీ-1 బాండ్స్ కాలపరిమితి వంద సంవత్సరాలుగా ఉండనుంది. బేస్-III టైర్ 2 బాండ్స్ కాలపరిమితిని మార్చి 2022 వరకు పదేళ్లుగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఒప్పందంలో పేర్కొన్న కాలపరిమితి కొనసాగుతుంది. ఏటీ-1 బాండ్స్ వ్యాల్యుయేషన్‌కు సంబంధించి కొత్త నిబంధనలను సెబి మార్చి 10న విడుదల చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రావాలి.

మ్యూచువల్ ఫండ్స్ అభ్యంతరం

మ్యూచువల్ ఫండ్స్ అభ్యంతరం

వంద ఏళ్ల నిబంధనపై మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పర్పెచ్యువల్ బాండ్స్ రీవ్యాల్యుయేషన్ వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని ఆందోళన చేశాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్ సమాఖ్య సెబిని సంప్రదించింది.

రంగంలోకి ఆర్థిక శాఖ

రంగంలోకి ఆర్థిక శాఖ

ఆ తర్వాత ఇది వివాదంగా మారింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగి పర్పెచ్యువల్ బాండ్స్ వ్యాల్యుయేషన్ కోసం జారీ చేసిన వందేళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని సెబిని ఆదేశించింది. వ్యాల్యుయేషన్ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని లేఖలో పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+